Kamareddy: 10th విద్యార్థుల అవస్థలు.. పరీక్షా సమయానికి రాని బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. May 23 నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపిన ప్రకటన.. ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని పలువురు ఆరోపిస్తున్నారు.
కాగా .. ఆర్టీసీ ఆఫర్ ప్రకటించిన, పదోతరగతి విద్యార్థుల అవస్థలు మాత్రం వర్ణనాతీమనే చెప్పాలి.
ఆర్టీసీ బస్సుల కొరతతో కామారెడ్డి జిల్లా బిచ్కుందలో పదోతరగతి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు పరీక్ష సమయం దగ్గర పడుతున్నా ఒక్క బస్సుకూడా రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పరీక్షా కేంద్రానికి ఎలా వెళ్ళాలో అర్థం కాని స్థితిలో వుండిపోయారు. పరీక్ష ఎలా రాస్తామో అనే టెక్సన్ లో వున్న విద్యార్థులకు బస్సు రాకపోవడంతో మరో టెక్సన్ ఎదురైంది. దీంతో.. స్పందించిన అధికారులు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను వ్యాన్ లో తరలించారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి ఒకే వ్యాన్ లో 78 మంది బాలికలను తరించారు. దీంతో స్థానికులు మండిపడుతున్నారు.
Also Read
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
Maharastra: లోయలో పడ్డ బస్సు.. 15 మందికి తీవ్రగాయాలు
బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువైయ్యాయని, మురికి నీరంతా బస్టాండ్ ప్రాంగణంలో ప్రవహించి పందులు, పశువులు సంచరిస్తూ తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు సమయానికి రాకపోవడంతో.. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సంస్థకు ప్రయాణికులే దేవుళ్లు అంటూ ప్రచారం చేసే అధికారులు బస్టాండ్లో నెలకొన్న సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ప్రయాణికులు మండి పడుతున్నారు.
కాగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యకపోయినా… ప్రక్షాళన చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా బస్సుల సంఖ్యను బాగా తగ్గిస్తోంది. హైదరాబాద్లో పాత డొక్కు బస్సుల్ని పక్కన పెడుతోంది. ఐతే… ఆ బస్సుల స్థానంలో కొత్త బస్సులు రావట్లేదు. ఫలితంగా 800 బస్సులు తగ్గిపోయాయి. అందువల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటం రొటీన్ సీన్. ఇక ఇప్పుడు పల్లెల్లో 1280 బస్సుల్ని కూడా లేపేయబోతున్నారు. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా బస్సుల కొరత తప్పదు. ముఖ్యంగా ఉదయం వేళ రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు సమయానికి బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తూ… డబ్బులు ఎక్కువగా చెల్లించుకోవాల్సి వస్తోంది.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!