Kamareddy: 10th విద్యార్థుల అవస్థలు.. పరీక్షా సమయానికి రాని బస్సులు
పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. May 23 నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపిన ప్రకటన.. ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని పలువురు ఆరోపిస్తున్నారు.
కాగా .. ఆర్టీసీ ఆఫర్ ప్రకటించిన, పదోతరగతి విద్యార్థుల అవస్థలు మాత్రం వర్ణనాతీమనే చెప్పాలి.
ఆర్టీసీ బస్సుల కొరతతో కామారెడ్డి జిల్లా బిచ్కుందలో పదోతరగతి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు పరీక్ష సమయం దగ్గర పడుతున్నా ఒక్క బస్సుకూడా రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పరీక్షా కేంద్రానికి ఎలా వెళ్ళాలో అర్థం కాని స్థితిలో వుండిపోయారు. పరీక్ష ఎలా రాస్తామో అనే టెక్సన్ లో వున్న విద్యార్థులకు బస్సు రాకపోవడంతో మరో టెక్సన్ ఎదురైంది. దీంతో.. స్పందించిన అధికారులు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను వ్యాన్ లో తరలించారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి ఒకే వ్యాన్ లో 78 మంది బాలికలను తరించారు. దీంతో స్థానికులు మండిపడుతున్నారు.
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
Maharastra: లోయలో పడ్డ బస్సు.. 15 మందికి తీవ్రగాయాలు
బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువైయ్యాయని, మురికి నీరంతా బస్టాండ్ ప్రాంగణంలో ప్రవహించి పందులు, పశువులు సంచరిస్తూ తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు సమయానికి రాకపోవడంతో.. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సంస్థకు ప్రయాణికులే దేవుళ్లు అంటూ ప్రచారం చేసే అధికారులు బస్టాండ్లో నెలకొన్న సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ప్రయాణికులు మండి పడుతున్నారు.
కాగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యకపోయినా… ప్రక్షాళన చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా బస్సుల సంఖ్యను బాగా తగ్గిస్తోంది. హైదరాబాద్లో పాత డొక్కు బస్సుల్ని పక్కన పెడుతోంది. ఐతే… ఆ బస్సుల స్థానంలో కొత్త బస్సులు రావట్లేదు. ఫలితంగా 800 బస్సులు తగ్గిపోయాయి. అందువల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటం రొటీన్ సీన్. ఇక ఇప్పుడు పల్లెల్లో 1280 బస్సుల్ని కూడా లేపేయబోతున్నారు. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా బస్సుల కొరత తప్పదు. ముఖ్యంగా ఉదయం వేళ రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు సమయానికి బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తూ… డబ్బులు ఎక్కువగా చెల్లించుకోవాల్సి వస్తోంది.
తాజావార్తలు
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో