KTR: నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేటీఆర్.. టూర్ షెడ్యూల్ ఇలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకోసం ప్రచారం నిర్వహించనున్నారు. రాకేష్ రెడ్డి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పార్టీ కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇల్లెందు పట్టణానికి చేరుకుంటారు. జేకే గ్రౌండ్స్లో పట్టభద్రులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్కు చేరుకుంటారు. గ్రాడ్యుయేట్లతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలకు చేరుకుని.. కళాశాల ఆవరణలో గ్రాడ్యుయేట్లతో సమావేశానికి హాజరుకానున్నారు.బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మాత్రం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Read also: Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. సర్వదర్శనానికి 16 గంటల సమయం..
Also Read
- Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- OTR : కవిత కొత్త పార్టీకి టిఆర్ఎస్ టైటిల్ ఉంటుందా ఉండదా.. పార్టీ పేరు మారుతుందా?
- Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
- OTR : గ్రేటర్ ఎన్నికలపై BJP టెన్షన్..? కాంగ్రెస్ వ్యూహాలపై కమలం అప్రమత్తం!
మరోవైపు శాసనమండలి ఎన్నికలకు నేతలు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి జిల్లాలోని మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం పార్టీ నేతలంతా ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్, కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు వావిరాజు రవిచంద్ర, బీఆర్ ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు తదితరులు ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయనున్నారు.
Sammakka Sarakka: సమ్మక్క, సారలమ్మ దర్శనం నిలిపివేత..?
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!