KTR: నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేటీఆర్.. టూర్ షెడ్యూల్ ఇలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకోసం ప్రచారం నిర్వహించనున్నారు. రాకేష్ రెడ్డి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పార్టీ కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇల్లెందు పట్టణానికి చేరుకుంటారు. జేకే గ్రౌండ్స్లో పట్టభద్రులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్కు చేరుకుంటారు. గ్రాడ్యుయేట్లతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలకు చేరుకుని.. కళాశాల ఆవరణలో గ్రాడ్యుయేట్లతో సమావేశానికి హాజరుకానున్నారు.బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మాత్రం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Read also: Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. సర్వదర్శనానికి 16 గంటల సమయం..
Also Read
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
మరోవైపు శాసనమండలి ఎన్నికలకు నేతలు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి జిల్లాలోని మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం పార్టీ నేతలంతా ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్, కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు వావిరాజు రవిచంద్ర, బీఆర్ ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు తదితరులు ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయనున్నారు.
Sammakka Sarakka: సమ్మక్క, సారలమ్మ దర్శనం నిలిపివేత..?
తాజావార్తలు
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!