KTR: నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేటీఆర్.. టూర్ షెడ్యూల్ ఇలా.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకోసం ప్రచారం నిర్వహించనున్నారు. రాకేష్ రెడ్డి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పార్టీ కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇల్లెందు పట్టణానికి చేరుకుంటారు. జేకే గ్రౌండ్స్లో పట్టభద్రులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్కు చేరుకుంటారు. గ్రాడ్యుయేట్లతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలకు చేరుకుని.. కళాశాల ఆవరణలో గ్రాడ్యుయేట్లతో సమావేశానికి హాజరుకానున్నారు.బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మాత్రం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Read also: Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. సర్వదర్శనానికి 16 గంటల సమయం..
Also Read
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
మరోవైపు శాసనమండలి ఎన్నికలకు నేతలు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి జిల్లాలోని మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం పార్టీ నేతలంతా ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్, కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు వావిరాజు రవిచంద్ర, బీఆర్ ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు తదితరులు ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయనున్నారు.
Sammakka Sarakka: సమ్మక్క, సారలమ్మ దర్శనం నిలిపివేత..?
తాజావార్తలు
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!