Palla Rajeshwar Reddy: పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palla Rajeshwar Reddy: పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే లోక్సభ ఎన్నికలపై ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు వస్తున్న నేతలపై కూడా ఆయన స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు అభ్యర్థులు లేక… మా వాళ్లను పిలిచి టికెట్లు ఇస్తున్నారని తెలిపారు. కొందరు ఇక్కడ గెలిచి వేరే పార్టీలలోకి వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిరికిపంద లే పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించు కున్న సొమ్మును సక్రమం చేసుకునేందుకు పార్టీలు మారుతున్నారని తెలిపారు. అలాంటి వారి అక్రమాలను మేమే బయట పెడతామన్నారు.
Read also: Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసింది
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించారు. ఇక్కడ గెలిచి వేరే పార్టీ లోకి వెళ్లే వాళ్ళను ప్రజలే రాళ్లతో కొడతారన్నారు. గతంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారే వాళ్ళను రాళ్లతో కొట్టాలి అన్నారని గుర్తు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్పై కూడా మాట్లాడారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. గత ప్రాజెక్టులను పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాటకాలాడుతుందని ఆరోపించారు. లక్ష ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టును చేపట్టడంతోపాటు 12 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉంటుందో, మీరు ఆ పార్టీలో ఎంతకాలం ఉంటారో ఆ దేవుడికే తెలియాలని హెచ్చరించారు.
BRS MPS: ఇదంతా కక్ష సాధింపే.. కవిత అరెస్టుపై బీఆర్ఎస్ ఎంపీలు ఫైర్
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!