Sangareddy District: మరిదిపై కారం చెల్లిన వదిన.. తమ్ముడిని గొడ్డలితో నరికిన అన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy District: మానవ సంబంధాలు మంటగలిసి.. తల్లిదండ్రుల కళ్లెదుటే తమ్ముళ్లు కొట్టుకుని చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి విషాద ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
తండ్రికి చెందిన 14 గుంటల భూమిని ఎవరు సాగు చేయాలంటూ అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఇందులో తమ్ముడు ప్రాణాలు కోల్పోగా… తండ్రి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. కంబాలపల్లి గ్రామంలో కుమ్మరి చంద్రయ్య(65)కు ఇద్దరు కుమారులు కుమ్మరి ఆంజనేయులు(43), కుమ్మరి ప్రభు(46) నివాసం ఉంటున్నారు. తనకున్న వ్యవసాయ భూమిని సమానంగా పంచుకున్న తండ్రి.. 14 గుంటల భూమిని తన కోసం ఉంచుకున్నాడు. అయితే ఆ భూమిని ఎవరు సాగు చేయాలనే విషయమై ఇద్దరు అన్నదమ్ములు తరచూ గొడవ పడేవారు. తల్లితండ్రులిద్దరూ… చిన్న కొడుకు కూడా ఆంజనేయులు వైపే ఉండడంతో ప్రభుకి తల్లిదండ్రులు, తమ్ముడిపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. యాసంగి పంటను విత్తేందుకు శనివారం మధ్యాహ్నం తన తండ్రి భూమిలో దున్నుతున్న ఆంజనేయులిని అన్న ప్రభువు అడ్డుకున్నాడు.
Also Read
Read also: Software Engineer Suicide: దూరం పెట్టిన ప్రేమికుడు.. మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య
ఈ విషయమై భార్య, తండ్రితో మాట్లాడుతుండగా ఆంజనేయులు రాత్రి అన్నం తింటున్నాడు. ఈలోగా ప్రభు తన భార్య, కొడుకుతో కలిసి గొడ్డలి, కట్టే, కారం తీసుకుని తిట్టుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లాడు. ప్రభు భార్య ఆంజనేయులు కండ్లలో కారం చల్లగా… ఆంజనేయులు పైన గొడ్డలితో విచక్షణరహితంగా దాడికి దిగాడు భర్త ప్రభు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రిని కూడా గొడ్డలితో నరికాడు. ప్రభు భార్య, ఇద్దరు కుమారులు కూడా వారిపై కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆంజనేయులు రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోగా, తీవ్రంగా గాయపడిన చంద్రయ్యను స్థానికులు అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సదాశివపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభు, అతని భార్య, కొడుకును అదుపులోకి తీసుకున్నట్లు గుర్తించారు. ఆంజనేయులు పనిచేస్తేనే తమ కుటుంబం బతుకుతుందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని, ఆయన మృతితో ఇద్దరు పిల్లలు, భార్య నిస్సహాయులయ్యారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
Fire Accident : ప్రమాదమా లేదా హత్యా.. బరేలీలో సజీవ దహనమైన కుటుంబం
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!