Boora Narsaiah Goud: అందరూ ఊహించిందే జరిగింది.. రాజగోపాల్ రెడ్డి పై బూరనర్సయ్య కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boora Narsaiah Goud: తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా. అయితే దీనిపై బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదు అందరూ ఊహించినదే జరిగిందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉంది ఆత్మ కాంగ్రెస్ లోనే ఉండిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదు అందరూ ఊహించినదే అన్నారు. రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన… ఆల్టర్నేట్ కాదు అనేది అవాస్తవమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితిల్లో జనాలు లేరన్నారు. కేసీఆర్ ని ప్రగతిభవన్ నుంచి ఖాళీ చేయించి పనిలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నయం కేవలం బీజేపీ అన్నారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. తనకు భువనగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఉందని తెలిపారు. కానీ పార్టీ అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయానికైనా శిరసా వహిస్తానని అన్నారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే.. ముందు నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. రాజగోపాల్ రెడ్డిపై బూర నర్సయ్యగౌడ్ను పోటీకి దింపాలని బీసీ యోచనలో ఉంది. టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది బీసీలు ఉన్నారు. ముఖ్యంగా గౌడ ఓటర్లు దాదాపు 16 శాతం అంటే 35 వేలకు పైగా ఉన్నారు. ముదిరాజ్, పద్మశాలి, యాదవ, ఎరుకల, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ ఓటర్లు కూడా భారీగానే ఉన్నారు. దీంతో బూర నర్సయ్యకు అవకాశం ఇస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
2014 లోక్సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి పోటీ చేసిన బూర నర్సయ్యగౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై విజయం సాధించారు. అయితే ఆయన ముందు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నారని, అసెంబ్లీకి పోటీ చేస్తే ఇబ్రహీంపట్నంకే తొలి ప్రాధాన్యత ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ముందు నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే బూర నర్సయ్య బరిలోకి దిగవచ్చని అంటున్నారు.
Israel-Hamas conflict: మైసా అబ్దెల్ హదీని ఎందుకు అరెస్ట్ చేమంటే.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
తాజావార్తలు
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!