Bandi Sanjay: మరో ఆందోళనకు సిద్ధం.. ఈనెల 25న నిరుద్యోగ మహాధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP To Protest Against TSPSC Paper Leak In The Name Of Unemployment Mahadharna: TSPSC పేపర్ లీకేజీ నేపథ్యంలో బీజేపీ మరో ఆందోళనకు సిద్ధమవుతోంది. ఈ నెల 25వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో ‘నిరుద్యోగ మహా ధర్నా’ చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు.. నిరుద్యోగ యువతతో కలిసి ఈ మహా ధర్నాను నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు ఇతరత్ర విషయాలపై పార్టీ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు.
Gangavva Panchangam: సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖుల పంచాంగం.. గంగవ్వ నోట..
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
ఈ సందర్భంగా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారణంగా 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో, వారికి మద్దతుగా వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలను రూపొందించేందుకు రెడీ అయ్యారు. సాగర హారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలపై చర్చించారు. తొలుత ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పేపర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన్ను బర్తరఫ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ చేయాల్సిందిగా బండి సంజయ్ పార్టీ నేతలను కోరారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న మీడియా, సోషల్ మీడియా సంస్థలను, యూట్యూబ్ ఛానళ్లను బెదిరించడం, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆయా సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవడంతోపాటు వారి పక్షాన పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఆయా సంస్థల కార్యాలయాలకు వెళ్లి జర్నలిస్టులకు సంఘీభావంగా తెలపాలని నిర్ణయం తీసుకొని.. వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో బృందాన్ని ఏర్పాటు చేశారు.
PM Modi: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొవిడ్పై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం
తాజావార్తలు
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!