Ntv Face to Face with KTR: దేశంలో బీజేపీకి ముఖ్యబలం.. కాంగ్రెస్ బలహీనతే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీ త్వరలోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై వివరించారు. తాను 8 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో పని చేశానని.. తర్వాత 8 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని.. అందుకే రాష్ట్రం ఆవిర్భవించిన రోజు కలిగిన తృప్తి, సంతోషంతో పోలిస్తే మిగతా విషయాలు సరితూగవన్నారు. ముఖ్యంగా తమ పార్టీకి 2014 ఫేజ్ బెస్ట్ ఫేజ్ అన్నారు.
జాతీయ రాజకీయాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తనదైన ముద్ర వేసిందని.. ఉదాహరణకు రైతు బంధు పథకాన్ని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి పీఎం కిసాన్ యోజనగా అమలు చేస్తోందని.. మిషన్ భగీరథ పథకం కూడా విజయవంతం కావడంతో ఆ పథకాన్ని కూడా కాపీ కొట్టి హర్ ఘర్ కో జల్ అనే పథకాన్ని చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమైన రాష్ట్రం అని.. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలోనే 8 ఏళ్లలో ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు.. మిగతా రాష్ట్రాలలో దేశంలో కేసీఆర్ ఎందుకు మంచి పాలన చేయలేరని ప్రశ్నించారు. ఇప్పటికే జాతీయ రాజకీయాలపై కేసీఆర్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని కేటీఆర్ వివరించారు.
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
మరోవైపు దేశంలో బీజేపీకి బలం కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనతనే బీజేపీ తన బలంగా విశ్వసిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే బలమైన ప్రత్యామ్నాయం ఉన్న చోట్ల బీజేపీ పప్పులు ఉడకటంలేదన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ, పంజాబ్లో ఆప్.. బలంగా ఉన్నాయి కాబట్టే అక్కడ బీజేపీ ఓడిపోయిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలోనూ టీఆర్ఎస్ పార్టీకి బలం ఉండటం వల్లే గత ఎన్నికల్లో 108 స్థానాల్లో తాము గెలిచామని కేటీఆర్ గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!