BJP Ramchander Rao : సింగరేణిని ATMలా వాడుకుంటున్నారు
- సింగరేణిపై బీజేపీ రామచందర్ రావు విమర్శలు
- CBI/SIT విచారణకు డిమాండ్
- ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్–బీఆర్ఎస్పై ఆరోపణలు
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన సొంత ఆస్తిలా వాడుకుందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని బీజేపీ నేత రామచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి , రాజకీయ పరిణామాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సింగరేణి సంస్థలో గత పదేళ్లుగా జరిగిన ప్రతి వ్యవహారంపై సిబిఐ (CBI) లేదా సిట్ (SIT) చేత సమగ్ర విచారణ జరపాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. “బీఆర్ఎస్ హయాంలో సింగరేణిని తమ సొంత ప్రాపర్టీలా వాడుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు తమ అనుచరులకు కాంట్రాక్టులు ఇవ్వాలని, తమకు వాటాలు రావాలని కొట్లాడుకుంటున్నారు” అని ఆయన విమర్శించారు. కోల్ బ్లాక్స్ టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు, అందులో పారదర్శకత ఎందుకు లేదు అనే విషయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
Pending Challans : వాహనదారులకు గుడ్న్యూస్.. పెండింగ్ చలాన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందిస్తూ, కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు ‘షాడో బాక్సింగ్’ చేస్తున్నాయని రామచందర్ రావు ఆరోపించారు. రెండేళ్ల నుంచి విచారణ జరుగుతున్నా, కేవలం అధికారులనే అరెస్ట్ చేస్తూ రాజకీయ నాయకులను ఎందుకు కాపాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీని ఓడించేందుకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని, దీని వెనుక ఉన్న అసలైన సూత్రధారులను బయటకు తీసుకురావాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై కేంద్ర సంస్థలు ఎందుకు వేగంగా స్పందించడం లేదన్న ప్రశ్నకు ఆయన సాంకేతిక కారణాలను వివరించారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జీవో ద్వారా తెలంగాణలోకి సిబిఐ రాకుండా అడ్డుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్ప సిబిఐ నేరుగా విచారించలేదు. కానీ ఈడీ (ED) కి అటువంటి నిబంధనలు లేవు, అందుకే ఈడీ అనేక కేసుల్లో వేగంగా విచారణ జరుపుతోంది” అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరించకపోవడం వల్లే విచారణలో జాప్యం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా, పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీలో ఎటువంటి విబేధాలు లేవని, ‘టీమ్ బీజేపీ తెలంగాణ’గా తామంతా ఐక్యంగా ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.
Amazon Smart Home విప్లవం.. కొత్త Eco షో సిరీస్తో ఇంటికి అత్యాధునిక హంగులు
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!