NTV Telugu Site icon

Kishan Reddy: బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చింది

Kishareddy

Kishareddy

Kishan Reddy: బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని వర్చువల్ గా వర్చువల్ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి కార్యక్రమంలో కిషన్ రెడ్డి, ఈటెల, ఇంద్రసేనారెడ్డి, రఘునందన్ రావు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వద్దన్న మజ్లిస్ ఈ అధికార పార్టీ కి అత్యంత సన్నిహిత పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చింది… తెలంగాణ వచ్చేది కాదని కేకే అన్నారని తెలిపారు. ప్రపంచంలో ఏ ఉద్యమంలో కూడా 12 వందల మంది అమరులు కాలేదని అన్నారు.

Read also: Kakani Govardhan Reddy: పబ్లిసిటీ కోసమే కోటంరెడ్డి హంగామా.. నాలుగేళ్లలో గుర్తుకు రాలేదా?

కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వారు తన తరవాత తన కొడుకు… ఆ తరవాత అయన కొడుకు ఉండాలని అనుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. బండి సంజయ్ పై అక్రమ కేసులు పెట్టి, మజ్లిస్ తో కలిసి బీజేపీ ను అణచి వేయలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త బండి సంజయ్ లా పని చేస్తారని అన్నారు. నిన్న సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వచ్చారని, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో సహా పెకిలించేవరకు విశ్రమించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ వ్యతిరేక శక్తులకు BRS కేరాఫ్ అడ్రస్ గా మారిందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా బీజేపీ ప్రతిజ్ఞ చేసిందని కిషన్‌ రెడ్డి తెలిపారు.
Parineeti Chopra : ఏప్రిల్ 10న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థం ?