గతంలో స్పీకర్ ను ఉద్దేశించి పోచారం మాట్లాడిన రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సర్దుకునే లోపే అసెంబ్లీ ప్రారంభం అయ్యింది… వాయిదా పడిందని విమర్శించారు. బీఏసీ మీటింగ్ కి మమ్మల్ని ఆహ్వానించక పోవడంపై స్పీకర్ ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. గతంలో ఒకరు, ఇద్దరు సభ్యులుగా ఉన్న పార్టీ లను బీఏసీ మీటింగ్ కి పిలిచారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ పిలిచారని అన్నారు. సభ గౌరవాన్ని పెంచాలని విజ్ఞప్తి కోరామన్నారు. ఎంత మంది సభ్యులు ఉంటే బీఏసీకి పిలవాలో రూల్స్ ఉంటే చెప్పండని ప్రశ్నిచారు. శాసన సభ వ్యవహారాల మంత్రి, స్పీకర్ చెప్పాలని కోరారు.
గతంలో ఉన్న సంప్రదాయాలు పాటిస్తారా లేదా? అంటూ ప్రశ్నించారు. రఘునందన్ రావు. గతంలో స్పీకర్ ను ఉద్దేశించి పోచారం మాట్లాడిన రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసారు. మీరిచ్చే నోటీస్ లు చట్ట బద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. మరమనిషి అనే పదం ఎమైన నిషేధిత పదమా? అంటూ ప్రశ్నించారు. ఏదో కారణంతో సభ నుండి బయటకు పంపించాలి అని చూస్తున్నారని మండిపడ్డారు. మాముఖం చూడటం ఇష్టంలేకపోతే.. ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు.
సమస్యల మాట్లాడకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల సభ జరగక పోతే మేము సభకు రామని భట్టి ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. బీజేపీనీ ఆహ్వానించాలని MIM ఎందుకు అడగలేదు లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరినో వ్యక్తిగతంగా అవమానించాలని మాకు లేదని స్పష్టం చేశారు. మొన్న నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి నీకు స్పీకర్ కు మధ్య జరిగింది ఏందో ఒక సారి చెప్పు? అని ప్రశ్నించారు. స్పీకర్ ను అవమానించింది మీరు, ప్రశాంత్ రెడ్డి అంటూ విమర్శించారు.