Raghunandan Rao: ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Raghunandan Rao Demanding CBI Enquiry On ORR Tollgate: ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము సీబీఐకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై బీజేపీ చాలారోజులుగా ప్రశ్నిస్తోందని, అయితే ఇటీవల బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదని కొందరు విమర్శిస్తున్నారని, తమకు ఎవరూ సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదని చురకలంటించారు. ఐఆర్బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే హత్యలు చేస్తున్నారని, ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. అసలు టోల్గేట్ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందిచండం లేదని ఆయన ప్రశ్నించారు.
MLA Vivekananda: కేటీఆర్ను ఇబ్బంది పెట్టేందుకు రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు
Also Read
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
7200 కోట్ల నుంచి 7380 కోట్లకు ఓఅర్ఆర్ టెండర్ విలువ పెంచింది ఎవరో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని రఘునందన్ రావు నిలదీశారు. ఒక దర్యాప్తు సంస్థ దీనిపై విచారణ జరుపుతోందని వెల్లడించారు. ఐఆర్బీ సంస్థ నేర చరిత్ర కలిగిందని, అలాంటి సంస్థకు టెండర్ను రద్దు చేయాలని కోరారు. వేసవి సెలవుల తరువాత దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అంతర్జాతీయ టెండర్ అని చెప్పినప్పుడు.. నిబంధనలు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో హెచ్ఎండీఏ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐఆర్బీ సంస్థకు ఎందుకు వెసులుబాటు ఇస్తున్నారని అడిగిన ఆయన.. టెండర్ల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సీబీఐ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఐఆర్బీ ఎక్కడిది? ఆ సంస్థ ఎవరిది? ఇంత మోసం జరుగుతుంటే ఎందుకు సీఎం స్పందించడం లేదు? ఓఆర్ఆర్ టోల్ గేట్పై సమీక్ష చేయడానికి సీఎం కేసీఆర్కు టైం లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Naveen Ul Haq: కోహ్లీకి నవీన్ ‘సారీ’ చెప్పాడా.. ఇదిగోండి ప్రూఫ్
అంతకుముందు కూడా.. కవిత, కేటీఆర్ తమ స్నేహితుల కంపెనీకి ఓఆర్ఆర్ను లీజుకు ఇచ్చారని రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్ను ఏప్రిల్ 11న తెరిచారని, కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని అన్నారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. కంపెనీ దాఖలు చేసిన బిడ్ కంటే.. ఈ 16 రోజుల్లో బిడ్ అమౌంట్ ఎలా పెరిగిందని అడిగారు. దీని వెనుక ఏదో మతలబు జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..