Etela Rajender: మునుగోడులో వారి బిక్షతో గెలిచారు.. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం..
మునుగోడు ఉప ఎన్నికలో కేవలం కమ్యూనిస్టులు, ఎంఐఎం, పోలీసుల బిక్షతోనే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.. కానీ, నల్గొండలో కమలం వికసించిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలో బీజేపీలో చేరికలు ఆగవు.. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం లాంటిదని చెప్పుకొచ్చారు.. ఇక, కేటీఆర్.. సీఎం కేసీఆర్ను మించిపోయారని ఫైర్ అయ్యారు.. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది… కాంగ్రెస్, కమ్యూనిస్టు కంచుకోటలో నేను రాజీనామా చేసి వస్తే ఆదుకున్నాని.. ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ రాజ్ గోపాల్ రెడ్డి హుందాగా వ్యవహరించారని ప్రశంసించారు.. డబ్బు, మద్యం అని కేటీఆర్ చిల్లరగా మాట్లాడారు.. కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకొని దగ్గరకు తీసుకున్నారు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే సంస్కృతి కేసీఆర్ది అని మండిపడ్డారు.. 18 వేల 900 మంది టీఆర్ఎస్ వాళ్లు పని చేశారు… 5 గ్రామాలకు ఒక్క ఎస్ఐ చొప్పున పర్యవేక్షణ కోసం పెట్టారు.. పంపిస్తున్న డబ్బులు, బహుమతులు అందుతున్నాయా? లేదా? అని చూసే బాధ్యత అప్పగించారు అని విమర్శించారు.
Read Also: Koti Deepotsavam 2022: 8వ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమాలు ఇవే..
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
ఇక, జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? అని నిలదీశారు ఈటల రాజేందర్.. 2014 తర్వాత కేసీఆర్ డబ్బును, పోలీసులను నమ్ముకున్నారన్న ఆయన.. కమాండ్ కంట్రోల్ రూం పెట్టుకొని చేస్తుంది ఏంది? నా గుమస్తా దగ్గర 90 లక్షలు ఉన్నాయని టాపింగ్ చేయక పోతే ఎలా తెలుస్తుంది… ? అని ప్రశ్నించారు. మీరు 5 వేలు ఓటుకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఫైర్ అయ్యారు.. రాజ్ గోపాల్ రెడ్డి… టీఆర్ఎస్ పుట్టక ముందే కాంట్రాక్టర్.. 35 సంవత్సరాల కోసం…. 18 వేల కోట్ల టెండర్ అన్నారు.. కాళేశ్వరం, మిషన్ భగీరథ కు కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే డబ్బులు తీసుకున్నారా? అని నిలదీశారు.. పెయిడ్ వర్కర్స్ ని పెట్టుకుని మా పై దాడులు చేస్తున్నారు.. పలివెలలో ఎవరు ఎవరి మీద దాడి చేశారో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు..
అక్కడ పని చేసిన మంత్రులు, ఎమ్మేల్యేలు అసలు విషయం ఏందో అర్థం అయింది…. తమ నియోజక వర్గాల్లో గెలవడం కష్టం అని అనుకుంటున్నారు అట అని ఎద్దేవా చేశారు ఈటల.. నల్గొండలో పార్టీ కమలం వికసించింది… ఖమ్మంలోనూ వికసిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కేసీఆర్కి శ్రీరామ రక్ష ప్రజలు కాదు… సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, కమాండ్ కంట్రోల్ రూమ్ ఆయనకు శ్రీరామ రక్ష అని సెటైర్లు వేశారు. మరోవైపు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల అప్పులు తీరిపోయాయన్న ఆయన.. పదవులు వస్తాయి పోతాయి , వ్యక్తిత్వం ముఖ్యం కేటీఆర్ అంటూ హితవు పలికారు.. అధికారం లేకుంటే వాళ్లు బతక లేరు అని ఆరోపించారు. మునుగోడులో ఎంత పని చేయాలో అంత చేయలేదు అనే భావన మాకు కూడా ఉందన్న ఆయన.. టీఆర్ఎస్ వాళ్లు ఊహించిన అన్ని ఓట్లు వాళ్లకు రాలేదన్నారు.. నల్గొండలో బీజేపీకి అన్ని ఓట్లు ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నారు వారు.. ఇక, బీజేపీలో చేరికలు ఆగవు.. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం అని వ్యాఖ్యానించారు ఈటల రాజేందర్.
తాజావార్తలు
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!