Etela Rajender: మునుగోడులో వారి బిక్షతో గెలిచారు.. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికలో కేవలం కమ్యూనిస్టులు, ఎంఐఎం, పోలీసుల బిక్షతోనే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.. కానీ, నల్గొండలో కమలం వికసించిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలో బీజేపీలో చేరికలు ఆగవు.. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం లాంటిదని చెప్పుకొచ్చారు.. ఇక, కేటీఆర్.. సీఎం కేసీఆర్ను మించిపోయారని ఫైర్ అయ్యారు.. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది… కాంగ్రెస్, కమ్యూనిస్టు కంచుకోటలో నేను రాజీనామా చేసి వస్తే ఆదుకున్నాని.. ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ రాజ్ గోపాల్ రెడ్డి హుందాగా వ్యవహరించారని ప్రశంసించారు.. డబ్బు, మద్యం అని కేటీఆర్ చిల్లరగా మాట్లాడారు.. కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకొని దగ్గరకు తీసుకున్నారు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే సంస్కృతి కేసీఆర్ది అని మండిపడ్డారు.. 18 వేల 900 మంది టీఆర్ఎస్ వాళ్లు పని చేశారు… 5 గ్రామాలకు ఒక్క ఎస్ఐ చొప్పున పర్యవేక్షణ కోసం పెట్టారు.. పంపిస్తున్న డబ్బులు, బహుమతులు అందుతున్నాయా? లేదా? అని చూసే బాధ్యత అప్పగించారు అని విమర్శించారు.
Read Also: Koti Deepotsavam 2022: 8వ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమాలు ఇవే..
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
ఇక, జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? అని నిలదీశారు ఈటల రాజేందర్.. 2014 తర్వాత కేసీఆర్ డబ్బును, పోలీసులను నమ్ముకున్నారన్న ఆయన.. కమాండ్ కంట్రోల్ రూం పెట్టుకొని చేస్తుంది ఏంది? నా గుమస్తా దగ్గర 90 లక్షలు ఉన్నాయని టాపింగ్ చేయక పోతే ఎలా తెలుస్తుంది… ? అని ప్రశ్నించారు. మీరు 5 వేలు ఓటుకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఫైర్ అయ్యారు.. రాజ్ గోపాల్ రెడ్డి… టీఆర్ఎస్ పుట్టక ముందే కాంట్రాక్టర్.. 35 సంవత్సరాల కోసం…. 18 వేల కోట్ల టెండర్ అన్నారు.. కాళేశ్వరం, మిషన్ భగీరథ కు కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే డబ్బులు తీసుకున్నారా? అని నిలదీశారు.. పెయిడ్ వర్కర్స్ ని పెట్టుకుని మా పై దాడులు చేస్తున్నారు.. పలివెలలో ఎవరు ఎవరి మీద దాడి చేశారో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు..
అక్కడ పని చేసిన మంత్రులు, ఎమ్మేల్యేలు అసలు విషయం ఏందో అర్థం అయింది…. తమ నియోజక వర్గాల్లో గెలవడం కష్టం అని అనుకుంటున్నారు అట అని ఎద్దేవా చేశారు ఈటల.. నల్గొండలో పార్టీ కమలం వికసించింది… ఖమ్మంలోనూ వికసిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కేసీఆర్కి శ్రీరామ రక్ష ప్రజలు కాదు… సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, కమాండ్ కంట్రోల్ రూమ్ ఆయనకు శ్రీరామ రక్ష అని సెటైర్లు వేశారు. మరోవైపు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల అప్పులు తీరిపోయాయన్న ఆయన.. పదవులు వస్తాయి పోతాయి , వ్యక్తిత్వం ముఖ్యం కేటీఆర్ అంటూ హితవు పలికారు.. అధికారం లేకుంటే వాళ్లు బతక లేరు అని ఆరోపించారు. మునుగోడులో ఎంత పని చేయాలో అంత చేయలేదు అనే భావన మాకు కూడా ఉందన్న ఆయన.. టీఆర్ఎస్ వాళ్లు ఊహించిన అన్ని ఓట్లు వాళ్లకు రాలేదన్నారు.. నల్గొండలో బీజేపీకి అన్ని ఓట్లు ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నారు వారు.. ఇక, బీజేపీలో చేరికలు ఆగవు.. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం అని వ్యాఖ్యానించారు ఈటల రాజేందర్.
తాజావార్తలు
-
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!