పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తా: ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ మరోసారి టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వారి నియోజకవర్గాల్లో పర్యటించి తీరుతానని, వారి భరతం పడతానని ఈటల వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన గెలుపు అని అభివర్ణించారు. అధికార పార్టీ నేతలు రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని ఈటల ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా… తనను గెలిపించిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: మంచిరేవుల ఫాంహౌస్ పేకాట కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
Also Read
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
హుజురాబాద్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి కల్పించారని.. కుల ప్రస్తావన తెచ్చినా ప్రజలు తనవైపే నిలబడి కేసీఆర్ సర్కారుకు గుణపాఠం చెప్పాలరని ఈటల వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలకు తన చర్మం వొలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేనని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తనను భర్తరఫ్ చేసిన తర్వాత తనను అక్కున చేర్చుకున్న బీజేపీకి రుణపడి ఉంటానన్నారు. దళిత బంధు పది సార్లు ఇస్తామని చెప్పినా ప్రజలు వారి మాటలు నమ్మలేదని.. ఓట్ల కోసం స్మశాన వాటికల్లో కూడా డబ్బులు పంచిన నీచులు టీఆర్ఎస్ పార్టీ నేతలు అని విమర్శలు చేశారు. హుజురాబాద్ ప్రజల తీర్పు రాష్ట్ర ప్రజల అభిప్రాయమని ఈటల పేర్కొన్నారు. రాబోయే కాలంలో బీజేపీని మరింత పటిష్టం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని ఈటల తెలిపారు.
తాజావార్తలు
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!