Bihar Congress: హైదరాబాద్ లో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల షాపింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Congress: జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి వెళ్లారో లేదో.. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నగరానికి అలా చేరుకున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 04) సాయంత్రం 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చారు. బీహార్లో కొత్తగా ఏర్పాటైన జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ నెల 12న అక్కడి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీహార్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రక్షణగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలోని ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్లో వారిని ఉంచారు. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ నెల 12వ తేదీ వరకు రిసార్టులో ఉంచాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే జార్ఖండ్ ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా రిసార్టులకే పరిమితం కాకుండా నగరంలో షాపింగ్ చేసినట్లు తెలిసింది. బీహార్కు చెందిన 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి హైదరాబాద్కు రాగా, మరికొంతమంది సోమవారం వచ్చారు. కానీ చాలా మందిని బీహార్ నుంచి హడావుడిగా హైదరాబాద్ తీసుకొచ్చారు.
Read also: Mumbai Indians: రోహిత్ సతీమణి సంచలన కామెంట్స్.. కావాలనే హిట్మ్యాన్ కెప్టెన్సీపై వేటు వేశారా?
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
దీంతో కనీసం బట్టలు కూడా తీసుకోకుండా నాయకులు హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. వారిలో చాలా మందికి పాన్ మసాలాలు తినే అలవాటు ఉన్నట్లు తెలిసింది. దీంతో సోమవారం నగరంలో పలువురు ఎమ్మెల్యేలు బట్టలు, పాన్ మసాలాలు, ఖైనీలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలకు పాన్ మసాలా, ఖైనీ తినడం అలవాటు.. కావున బీహార్ నుంచి తెచ్చిన పాన్ మసాలా అయిపోవడంతో.. స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన కార్లలో షాపింగ్ చేశారు. మరికొందరు బట్టలు కొన్నారు.. చార్మినార్ చూడాలని ఎమ్మెల్యేలు అన్నారు. ఏఐసీసీ అనుమతిస్తే అక్కడికి తీసుకెళ్తామని, తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. కాగా.. ఇటీవల నితీష్ కుమార్ భారత్ కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్డీయే కూటమిలో బీజేపీకి 78, జేడీయూకి 45, హిందుస్థాన్ అవామీ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 22 మంది, వామపక్షాలకు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు.
Kalki: డేట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు…
తాజావార్తలు
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?