Bihar Congress: హైదరాబాద్ లో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల షాపింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Congress: జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి వెళ్లారో లేదో.. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నగరానికి అలా చేరుకున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 04) సాయంత్రం 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చారు. బీహార్లో కొత్తగా ఏర్పాటైన జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ నెల 12న అక్కడి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీహార్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రక్షణగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలోని ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్లో వారిని ఉంచారు. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ నెల 12వ తేదీ వరకు రిసార్టులో ఉంచాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే జార్ఖండ్ ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా రిసార్టులకే పరిమితం కాకుండా నగరంలో షాపింగ్ చేసినట్లు తెలిసింది. బీహార్కు చెందిన 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి హైదరాబాద్కు రాగా, మరికొంతమంది సోమవారం వచ్చారు. కానీ చాలా మందిని బీహార్ నుంచి హడావుడిగా హైదరాబాద్ తీసుకొచ్చారు.
Read also: Mumbai Indians: రోహిత్ సతీమణి సంచలన కామెంట్స్.. కావాలనే హిట్మ్యాన్ కెప్టెన్సీపై వేటు వేశారా?
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
దీంతో కనీసం బట్టలు కూడా తీసుకోకుండా నాయకులు హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. వారిలో చాలా మందికి పాన్ మసాలాలు తినే అలవాటు ఉన్నట్లు తెలిసింది. దీంతో సోమవారం నగరంలో పలువురు ఎమ్మెల్యేలు బట్టలు, పాన్ మసాలాలు, ఖైనీలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలకు పాన్ మసాలా, ఖైనీ తినడం అలవాటు.. కావున బీహార్ నుంచి తెచ్చిన పాన్ మసాలా అయిపోవడంతో.. స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన కార్లలో షాపింగ్ చేశారు. మరికొందరు బట్టలు కొన్నారు.. చార్మినార్ చూడాలని ఎమ్మెల్యేలు అన్నారు. ఏఐసీసీ అనుమతిస్తే అక్కడికి తీసుకెళ్తామని, తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. కాగా.. ఇటీవల నితీష్ కుమార్ భారత్ కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్డీయే కూటమిలో బీజేపీకి 78, జేడీయూకి 45, హిందుస్థాన్ అవామీ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 22 మంది, వామపక్షాలకు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు.
Kalki: డేట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు…
తాజావార్తలు
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
-
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
-
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్పై బుచ్చిబాబు ఎమోషనల్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!