Bhatti Vikramarka: మోడీ పర్యటన వల్ల తెలంగాణ కు ఉపయోగం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: మోడీ పర్యటన వల్ల తెలంగాణ కు ఉపయోగం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు. మోడీ పర్యటన వల్ల తెలంగాణకు ఉపయోగం లేదని అన్నారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నారు BRS సర్కార్ పై ఏమి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోలేదని అంటే మోడీ అసమర్థుడు అనే కదా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ లు ఒప్పందములో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని భట్టి విక్రమార్క అన్నారు. సంజయ్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లి వరంగల్లో జరిగిన బీజేపీ సమావేశంలో డీల్పై చర్చించిన తర్వాతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డిని నియమించారని అన్నారు. రాహుల్ తమ నాయకుడని.. ఆయన్ని ఏ హోదాలోవస్తారని ప్రశ్నించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్ కలిసి దేశ, రాష్ట్ర వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కోట్లకు పడగలెత్తిన తెలంగాణకు న్యాయం చేయలేకపోయారన్నారని తెలిపారు.
Read also: Bandi Sanjay: వరంగల్లో బీజేపీ సభ.. ‘నా మోడీ’ అంటూ బండి ఎమోషనల్ స్పీచ్..
Also Read
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
ప్రజల సంక్షేమానికి అడ్డుగా ఉన్న వారిని తొలగించాలన్నారు. పెట్టుబడిదారీ బీజేపీ, భూస్వామ్య బీఆర్ఎస్లను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని భావిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఏది దక్కుతుందో అది పాలకులకే చెందుతుందని ప్రజలు గుర్తించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు, సిటీ సెంటర్లోని వైయస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. పంజాగుట్ట సర్కిల్ లోని వైయస్సార్ విగ్రహాం వద్ద జరిగే జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని సీఎల్పీ కార్యాలయంలో జరిగే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు.
Nadendla Manohar : ఈ ప్రభుత్వానికి స్పందించే గుణం లేదు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
-
Mega Hero’s : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!