Bhatti Vikramarka: టీఆర్ఎస్ మాత్రమే కాదు.. బీజేపీ కూడా ఎమ్మెల్యేలను కొన్నది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka Fires On BJP TRS Parties Over Moinabad Farm House Issue: మొయినాబాద్ ఫాంహౌస్లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడం కొత్త కాదని.. ఇప్పటికే సీఎం కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని వ్యాఖ్యానించారు. బీజేసీ సైతం.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కొత్త కాదని.. ఇప్పుడేదో కొత్తగా జరుగుతున్నట్టు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. సర్పంచుల నుంచి మొదలుకొని.. టీఆర్ఎస్ పార్టీని అందరినీ కొనుగోలు చేసిందని ఆరోపించారు.
ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కొత్తగా తెరలేపిన డ్రామాను రక్తి కట్టించేందుకు నిన్న రాత్రి నుంచి తెగ ప్రయత్నిస్తున్నాయని.. ప్రజలు ఆ డ్రామాల్ని నమ్మడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే తాము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటామని బీజేపీ మొదటి నుంచి చెప్తూ వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు విషయం టీఆర్ఎస్ దగ్గరికి వచ్చేసరికి.. ఏదో జరిగిపోతోందంటూ ఆ పార్టీ గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల వ్యవహారం చాలా నీచంగా ఉందన్న ఆయన.. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగుల్ని ఆ రెండు పార్టీలు తమకు అనుగుణంగా భలే వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రారంభించిందే టీఆర్ఎస్ పార్టీ అని, దాన్ని బీజేపీ కొనసాగిస్తోందని విమర్శించారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
తెలంగాణలో రాజకీయాలన్నీ అమ్మకం, కొనుగోలు చుట్టే తిరుగుతున్నాయని ఆగ్రహించిన భట్టి విక్రమార్క.. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వస్తే.. 10వ షెడ్యూల్ని పూర్తిగా మార్చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!