Bhatti Vikramarka: టీఆర్ఎస్ మాత్రమే కాదు.. బీజేపీ కూడా ఎమ్మెల్యేలను కొన్నది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka Fires On BJP TRS Parties Over Moinabad Farm House Issue: మొయినాబాద్ ఫాంహౌస్లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడం కొత్త కాదని.. ఇప్పటికే సీఎం కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని వ్యాఖ్యానించారు. బీజేసీ సైతం.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కొత్త కాదని.. ఇప్పుడేదో కొత్తగా జరుగుతున్నట్టు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. సర్పంచుల నుంచి మొదలుకొని.. టీఆర్ఎస్ పార్టీని అందరినీ కొనుగోలు చేసిందని ఆరోపించారు.
ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కొత్తగా తెరలేపిన డ్రామాను రక్తి కట్టించేందుకు నిన్న రాత్రి నుంచి తెగ ప్రయత్నిస్తున్నాయని.. ప్రజలు ఆ డ్రామాల్ని నమ్మడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే తాము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటామని బీజేపీ మొదటి నుంచి చెప్తూ వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు విషయం టీఆర్ఎస్ దగ్గరికి వచ్చేసరికి.. ఏదో జరిగిపోతోందంటూ ఆ పార్టీ గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల వ్యవహారం చాలా నీచంగా ఉందన్న ఆయన.. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగుల్ని ఆ రెండు పార్టీలు తమకు అనుగుణంగా భలే వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రారంభించిందే టీఆర్ఎస్ పార్టీ అని, దాన్ని బీజేపీ కొనసాగిస్తోందని విమర్శించారు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
తెలంగాణలో రాజకీయాలన్నీ అమ్మకం, కొనుగోలు చుట్టే తిరుగుతున్నాయని ఆగ్రహించిన భట్టి విక్రమార్క.. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వస్తే.. 10వ షెడ్యూల్ని పూర్తిగా మార్చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!