నెల రోజులకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. మరో నాలుగు రోజుల్లో ఆయన మొదటివిడత యాత్ర ముగియనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పాల్గొన్న ఈ యాత్రలో.. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు సంజయ్. పార్టీ ఎక్కడ బలంగా ఉంది స్థానిక నాయకుల పరిస్థితి ఏంటీ అనే క్లారిటీకి వచ్చారు అవినీతి, నియంతృత్వం, కుటుంబపాలన నుంచి విముక్తి కోసమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్ట్ 28న ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు.
హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర హైద్రాబాద్, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల మీదుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. ఈ నెల రోజుల్లో రెండు రోజుల బ్రేక్ తప్ప మిగతా అన్ని రోజులు పాదయాత్ర జరిగింది. సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు, సెప్టెంబర్ 17 అమిత్ షా సభ రోజు ఆయన యాత్ర జరగలేదు. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పాల్గొని ప్రసంగించారు.
Also Read
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వారి ప్రసంగాలు సాగాయి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, రమణ్సింగ్.. ఐదుగురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సంగ్రామ యాత్రలో భాగంగా ఇప్పటివరకు సుమారు నాలుగు వందల కిలోమీటర్లు నడిచారు బండిసంజయ్. దారి వెంబడి తనను కలిసిన వారితో మాట్లాడుతూ ముందుకు సాగారు. వివిధ వర్గాలవారు.. తమ సమస్యలను సంజయ్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన పలు అంశాలపై సీఎంకి లేఖ రాశారు. అక్టోబర్ 2తో సంజయ్ మొదటి విడత యాత్ర ముగియనుంది. ఉపఎన్నిక జరగాల్సి ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన ప్రజా సంగ్రామ యాత్రను భారీ రోడ్ షోతో ముగించాలని నిర్ణయించారు. ఈ ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!