Bandi Sanjay: సీఎం అవినీతితో తెలంగాణను అప్పుల పాలు చేశారు.
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మాటలను, నాయకులు, అధికారుల మాటలను పట్టించుకునే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. బొగ్గు దిగుమతి అంశంలో కేసీఆర్ ప్రజలను పక్కదోవ పట్టించారని అన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి విచ్చల విడి అవినీతితో తెలంగాణను అప్పు ల పాలు చేశారని.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం సంస్థల నుంచి అప్పులు తెచ్చాడని.. కొత్తగా అప్పులు వచ్చే పరిస్థితి లేదని ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
24 గంటల ఉచిత విద్యుత్ పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి రూ. 60 వేల కోట్ల రూపాయలను డిస్కంలకు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నారు. పాతబస్తీలో ఏడాదికి రూ. 1000 కోట్లను వసూలు చేయడం లేదని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో సపరేట్ సబ్ స్టేషన్ పెట్టుకుని వందల ఎకరాలకు ఉచిత కరెంట్ వాడుకుంటున్నారని విమర్శించారు. 40 గ్రామాలకు ఉపయోగించే విద్యుత్ ను ఫామ్ హౌజ్ కే వాడుతున్నారని ఆరోపించారు.
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తానని టీఆర్ఎస్ నేతలు ఎంతో మంది యువకుల నుండి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో వారంతా తిరగబడుతున్నారని గ్రహించి కాలుష్యం పేరుతో ఏకంగా ఫ్యాక్టరీనే మూసివేయించారని విమర్శించారు. ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందో అని అక్కసుతోనే ఎరువుల ఫ్యాక్టరీని మూసేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక వేళ మీటర్లు పెడితే టీఆర్ఎస్ నాయకుల బండారం బయటపడుతుందని.. అందుకే మోటర్ల దగ్గర మీటర్లు పెడుతున్నారని బీజేపీని బద్నాం చేశాడని విమర్శించారు. రూ.3కే దొరికే యూనిట్ కరెంట్ ను రూ. 6కు కొని కమీషన్ల రూపంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. దేశాన్ని కరెంట్ కష్టాల నుంచి బయటపడేలా చేసింది బీజేప ప్రభుత్వమే అని అన్నారు. అన్ని పథకాలను కేంద్రమే చేస్తుంటే టీఆర్ఎస్ తమవిగా చెప్పుకుంటున్నారని విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?