Bandi Sanjay: సీఎం అవినీతితో తెలంగాణను అప్పుల పాలు చేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మాటలను, నాయకులు, అధికారుల మాటలను పట్టించుకునే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. బొగ్గు దిగుమతి అంశంలో కేసీఆర్ ప్రజలను పక్కదోవ పట్టించారని అన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి విచ్చల విడి అవినీతితో తెలంగాణను అప్పు ల పాలు చేశారని.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం సంస్థల నుంచి అప్పులు తెచ్చాడని.. కొత్తగా అప్పులు వచ్చే పరిస్థితి లేదని ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
24 గంటల ఉచిత విద్యుత్ పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి రూ. 60 వేల కోట్ల రూపాయలను డిస్కంలకు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నారు. పాతబస్తీలో ఏడాదికి రూ. 1000 కోట్లను వసూలు చేయడం లేదని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో సపరేట్ సబ్ స్టేషన్ పెట్టుకుని వందల ఎకరాలకు ఉచిత కరెంట్ వాడుకుంటున్నారని విమర్శించారు. 40 గ్రామాలకు ఉపయోగించే విద్యుత్ ను ఫామ్ హౌజ్ కే వాడుతున్నారని ఆరోపించారు.
Also Read
- CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
- Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
- Mandula Samuel : కాంగ్రెస్లో కాక రేపిన సామేల్.. కోమటిరెడ్డి బ్రదర్స్పై ఫైర్
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తానని టీఆర్ఎస్ నేతలు ఎంతో మంది యువకుల నుండి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో వారంతా తిరగబడుతున్నారని గ్రహించి కాలుష్యం పేరుతో ఏకంగా ఫ్యాక్టరీనే మూసివేయించారని విమర్శించారు. ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందో అని అక్కసుతోనే ఎరువుల ఫ్యాక్టరీని మూసేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక వేళ మీటర్లు పెడితే టీఆర్ఎస్ నాయకుల బండారం బయటపడుతుందని.. అందుకే మోటర్ల దగ్గర మీటర్లు పెడుతున్నారని బీజేపీని బద్నాం చేశాడని విమర్శించారు. రూ.3కే దొరికే యూనిట్ కరెంట్ ను రూ. 6కు కొని కమీషన్ల రూపంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. దేశాన్ని కరెంట్ కష్టాల నుంచి బయటపడేలా చేసింది బీజేప ప్రభుత్వమే అని అన్నారు. అన్ని పథకాలను కేంద్రమే చేస్తుంటే టీఆర్ఎస్ తమవిగా చెప్పుకుంటున్నారని విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
OTR: ‘నో పాలిటిక్స్… ఓన్లీ రూల్స్’.. నిబంధనలకే ప్రాధాన్యం అంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి..
-
Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
-
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్తో రూమర్స్పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
-
Prabhas: “నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి”
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!