Bandi Sanjay : సీఎంకి కుడా సిట్ నోటీసులు ఇవ్వాలి.. ఆయనను కూడా విచారించాలి
- కేసీఆర్ అనే మూర్ఖుడు రాజకీయ నాయకుల ఫోన్లని ట్యాప్ చేశాడు
- BRS మంత్రుల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారు
- వాళ్ళను కూడా విచారణ జరిపాలి
- బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే
- రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనుమానం ఉంది : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ బూటకపు విచారణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోణాన్ని తప్పుగా మలుపు తిప్పుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నప్పటికీ వారిని మాత్రం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యాంశం.. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయించారన్నది. “కేసీఆర్ అనే మూర్ఖుడు రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించాడు. ఆయన తన కుమారుడితో కలిసి ప్రత్యేక ఇన్టెలిజెన్స్ బ్రాంచ్ (SIB) ను వ్యక్తిగత అవసరాల కోసం దుర్వినియోగం చేశారు,” అంటూ సంజయ్ ఆరోపించారు.
Marco Rubio: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది ట్రంపే.. శాంతి అధ్యక్షుడిగా మార్కో రూబియో బిరుదు
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఇంతటితో ఆగకుండా.. “TSPSC పేపర్ లీకేజీ విచారణ చేస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. రాధాకృష్ణ రావు, ప్రభాకర్ రావులను ఎంత క్షోభకు గురి చేశారో గుర్తుంచుకోవాలి” అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కేసీఆర్ కుటుంబానికి పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన చెప్పింది కేసీఆర్ చెప్పినట్లే ఉంది. ఇప్పుడు కమిషన్లు పెట్టడం, విచారణల పేరిట డ్రామాలు ఆడడం ఎందుకు?’’ అని ప్రశ్నించారు. వాస్తవమైన విచారణ కావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ‘‘మీ విచారణలపై నాకెలాంటి నమ్మకమూ లేదు. ఈ కేసును తక్షణమే సీబీఐకి ఇవ్వండి. కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా మాత్రమే నిజం వెలుగు చూస్తుంది,’’ అని డిమాండ్ చేశారు.
‘‘ఒక్క రాజకీయ నాయకుడినీ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. వందల కోట్ల కిక్బ్యాక్లు పట్టుబడ్డాయి, కానీ వాటి విచారణ లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఓ మంత్రి వద్ద 7 కోట్లు దొరికాయి. వాటిపై ఎలాంటి అడుగులు వేయడం లేదు. ఇదేంటి న్యాయం?’’ అని సంజయ్ ప్రశ్నించారు. డిల్లీలో BRS, కాంగ్రెస్ నేతల మధ్య ‘మూట్ల డీల్’లు జరుగుతున్నాయని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక్కో స్కాం వెనుక రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి. కేసీఆర్ కాంగ్రెస్ నేతలతో కలిసి వందల కోట్ల లావాదేవీలు చేస్తున్నాడు,’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gautam Gambhir: హమ్మయ్య.. గంభీర్ హామీ ఇచ్చాడు! ఇక అరంగేట్రం పక్కా
- Tags
- bandi sanjay
- BRS
- CBI probe
- congress
- kcr
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!