Hyderabad Crime: దారుణం.. పార్టీలో ఆసుపత్రి సిబ్బంది.. వైద్యం అందక శిశువు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలోని చాదర్ ఘాట్ లో ఓప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు ప్రాణాలు వదిలిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే హస్పట్ బిల్డింగ్ పై ఓ వివాహానికి ముందస్తు పార్టీ వేడుకల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. డీజేతో పాటలకు స్టెప్పులు వేస్తూ వేడుకలు చేసుకుంటున్న సందర్బంలో ప్రసవం కోసం వచ్చిన గర్భవతిని వైద్యులు పట్టించుకోలేదు. దీంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. అయినా వైద్యలు పట్టించుకోకుండా పార్టీలో మునిగిపోయారు. అయితే గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో.. శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈఘటన పాతబస్తీలో జరిగింది.
కాగా.. చాదర్ఘాట్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గానా బజానా, బాణాసంచాలో సిబ్బంది హంగామా చేపట్టారు. రానున్న మాసంలో డాక్టర్ కూతురు వివాహం ఉండటంతో ముందస్తుగానే ఆసుపత్రి బిల్డింగ్పై పార్టీని ఏర్పాటు చేశారు. డీజేలో పాటలుపెట్టుకుని ఓరేంజ్ లో డ్యాన్స్లు చేస్తూ సిబ్బంది మునిగిపోయారు. అయితే ఆ సమయంలోనే ఓ గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రిలో వచ్చింది. ఆ గర్భిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపినా వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది స్పందించక పోవడం గమనార్హం. డీజే పార్టీలో లీనమై ఎంజాయ్ చేస్తూనే వుండిపోయారు.
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
అయితే ఈ క్రమంలో గర్భణి తీవ్ర నరకయాతన అనుభవించింది. కానీ శిశువు గర్భంలోనే మృతి చెందింది. కాగా.. గర్భిని ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్టు విశ్వనీయ సమాాచారం. కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. స్థానిక సమాచారంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. పోస్టుమార్టం కోసం మృతి చెందిన శిశువు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రోగులను పట్టించుకోకుండా పార్టీలో నిమగ్నమైన సదరు ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Presidential polls 2022: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్
తాజావార్తలు
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!