హైదరాబాద్లో ప్రేమజంట ఆత్మహత్య.. కారణం ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో ఓ బాలిక, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఆ జంట.. ఇవాళ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య నగర్ వద్ద ఉన్న క్వారీ నీటి గుంటలో శవాలుగా తేలారు.. నీటిపై తేలుతున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యవహారం వెలుగుచూసింది.. అయితే, ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (17), విషాల్ (21) అనే జంట.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.. బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా.. విషాల్.. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం ఇళ్లలో కూడా తెలిసిపోవడంతో.. ఇద్దరి తల్లిదండ్రులు వీరి ప్రేమని ఒప్పుకోనట్టుగా తెలుస్తోంది.. దీంతో.. వారు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు. ఇక, 14వ తేదీన జగద్గిరిగుట్ట పీఎస్ లో మిసింగ్ కేసు నమోదు అయ్యింది.. ఇవాళ మృతదేహాలను గుర్తించి.. పోస్టుమార్టం నిర్వహించారు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..
-
Astrology: జూలై 11 శనివారం దినఫలాలు..
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!