Biryani Packet: ఇదెక్కడి విచిత్రంరా సామీ.. అడిగితే అలా చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థులు మధ్య చిన్న ఘర్షణ ప్రాణాలు తీసుకునేందుకు తెలుత్తుతున్నాయి. చిన్న చిన్న మాటలకు జీవితాన్ని నాసనం చేసుకునేందుకు కూడా వెనుకాడటం లేదు పసి ప్రాణాలు. చిన్న వయస్సులో ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడంలేదు. సెల్ ఫోన్ మహత్యమా.. లేక సినిమాల ప్రభావమో. ఒక విధ్యార్థి తోటి విద్యార్థిని బిర్యానీ ప్యాకెట్ చూశావా అని అడినందుకు మరో విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడిన విచిత్ర ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్లంపల్లికి చెందిన రామస్వామి, సువర్ణ దంపతుల కుమారుడు చారగొండ రాజేష్ అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో అక్కడ హాస్టల్లో ఉంటున్న తమ వార్డులను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు. అయితే.. అదే తరగతికి చెందిన అరుణ్ అనే విద్యార్థి తల్లిదండ్రులు బాలుడి కోసం బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చారు. అరుణ్ మధ్యాహ్నం బిర్యానీ తిని, రాత్రి తర్వాత తినడానికి మిగిలిపోయిన వాటిని పెట్టెలో ఉంచుకున్నాడు. తర్వాత పెట్టెలో చెక్ చేయగా అది కనిపించలేదు. ఇది తిన్నారా అని స్నేహితులను అడగడంతో పాటు.. రాజేష్ను కూడా ఇదే విషయమై ప్రశ్నించాడు. దీంతో అవమానంగా భావించాడో.. లేక తనే తినేసానని తెలిసింది అనుకున్నాడో ఏమో గానీ రాజేష్ ఏమీ మాట్లాడకుండా పరుగులు పెడుతూ..హాస్టల్ భవనంపై అంతస్తు వరకు వెళ్లాడు. అక్కడి నుంచి కిందికి దూకేసాడని తోటి విధ్యార్థులు చెబుతున్నారు. అయితే వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది రాజేష్ను చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత అతని కుడి కాలు ఫ్రాక్చర్ అయి ఉంటుందని వైద్యులు అనుమానించడంతో మహబూబ్నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కొడుకు దొంగతనంగా బిర్యానీ తినడం ఏంటని ఆవేదన వ్యక్తం చేసారు. అయినా తోటి విద్యార్థులు నా కుమారున్ని వేధిస్తుంటే అధికారులు ఏమయ్యారని ప్రశ్నించారు. తన కుమారున్ని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
President of India : ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ముర్ము ఎన్నిక
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
తాజావార్తలు
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!