Ashwinikumar: ప్రోటోకాల్ పాటించలేదు
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నట్టే.. మర్యాదల విషయంలోనూ అదే జరుగుతోంది. కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నాను. సమతామూర్తి కేంద్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. నా శాఖల పౌర సరఫరాలు, పర్యావరణ శాఖలకు సంబంధించి రివ్యూ చేశానన్నారు. ఈ రివ్యూకి అధికారులు మాత్రమే వచ్చారు. రాష్ట్ర మంత్రులు ఎవరూ సమీక్షకు హాజరు కాలేదు. నావిషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. అతిధి మర్యాద ఇవ్వలేదని విమర్శించారు.
2021లో 141.09 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసిన కేంద్రం రూ 26 వేల కోట్లు రైతులకు కేంద్రం చెల్లించింది. అవినీతి విషయం లో కేంద్రం జీరో టాలరెన్సు తో ఉంది … కేంద్రం పై అవినీతి ఆరోపణల్లో నిజం లేదు, మోడీ చరిత్రలో అవినీతికి తావులేదన్నారు. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తే అది మీ మీదనే పడుతుందన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రేషన్ షాప్స్ లో 2023 వరకు ఫోర్టిఫైడ్ రైస్ అందుబాటులోకి వస్తుందన్నారు కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే.
Also Read
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
2024 లో దేశం మొత్తం బహిరంగ మార్కెట్ లో కూడా ఫోర్టిఫైర్డ్ రైస్ అందుబాటులోకి తెస్తాం. తెలంగాణలో 25 రైస్ మిల్స్ తమ మిషనరీని అప్ గ్రేడ్ చేసుకున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మిగతా రైస్ మిల్స్ కూడా అప్ గ్రేడ్ కానున్నాయన్నారు. ఆహార భద్రత పక్కాగా అమలు చేస్తున్నాం.. ఐ.సీడీఎస్ అంగన్ వాడీల ద్వారా పిల్లలకు, గర్భవతులకు పోషకాహారం అందజేస్తున్నాం అన్నారు.
గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం అనీ, 2070 వరకు కార్బన్ ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకువస్తాం అన్నారు అశ్వినీ కుమార్. తెలంగాణలో హైద్రాబాద్ తో సహా నాలుగు పట్టణాల్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ గా ఉంది. పరిశ్రమల వ్యర్ధాలను మూసీ, హుస్సేన్ సాగర్ లోకి వదలడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయన్నారు. మూసీ, హుస్సేన్ సాగర్ లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాటి ప్రక్షాళనకి కృషి చేస్తాం అన్నారు. హైదరాబాద్, నల్గొండ, పటంచేరు, సంగారెడ్డి ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు దృష్టి పెట్టాం. తెలంగాణ రైతులకు సోలార్ పంప్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేదని విమర్శించారు.
తాజావార్తలు
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
-
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
-
Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!