టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, సినీ తారలు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. తాజాగా మరో మైలురాయిని సాధించింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని పద్మవిభూషణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ప్రశంసించారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన కార్యక్రమంలో హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్ పాల్గొన్నారు.