Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం.. షా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ముస్లీం రిజర్వేషన్లు తీసేస్తాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ఈ పదేళ్ళలో అప్పుల తెలంగాణగా మారిందన్నారు. యువత, మహిళలు, అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర, దేశ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా మోడీ కి, కమలం గుర్తుకు ఓటు వేస్తారన్నారు. లిక్కర్, గ్రానైట్, మియాపూర్ భూములు, ఓఆర్ఆర్ ఇలా ఈ ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని అన్నారు. దళిత బందు డబ్బులను బీఆర్ఎస్ కార్యకర్తల తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. దీంతో కేసీఆర్ విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. సినిమా, ఫార్మా, ఎడ్యుకేషన్ సిటీలని ఏర్పాటు చేస్తానని చేయలేదన్నారు. మేము ఇచ్చిన హామీలు ఈ 9 ఏళ్లలో నెరవేర్చామన్నారు. 370 ఆర్టికల్ ఎత్తేసామని తెలిపారు. అయోధ్యలో రామాలయం, ట్రైబల్ తలక్ , గ్రామీణ రోడ్లు, ప్రతి పేద వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం, ఇల్లు ఇలా ఎన్నో చేస్తామని తెలిపారు. రాజ్యాంగ వ్యతిరేకంగా 4 శాతం ముస్లిం రిజర్వేషన్ లు ఇచ్చారని తెలిపారు. వీటిని ఎత్తి వేస్తామని స్పష్టం చేశారు. ఆ రిజర్వేషన్ లు బీసీ, ఎస్సీ, ఎస్టీ లకి ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.
Read also: China Pneumonia: చైనాలో విస్తరిస్తున్న కొత్తరకం న్యుమోనియా.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన!
Also Read
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
- OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
- Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
వడ్లకు క్వింటాల్ కి 3,100 ఇస్తామన్నారు. బాయిల్డ్ రైస్ కూడా కొంటామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై వాట్ తగ్గిస్తామన్నారు. విద్యార్థునులకి ఫ్రీ లాప్ టాప్ ఇస్తామని తెలిపారు. తెలంగాణ ఆందోళనను అణచివేసేందే కాంగ్రెస్ అని అన్నారు. అంజయ్యను, పివి నర్సింహ రావు లని అవమానిచింది కాంగ్రెస్.. దీన్ని తెలంగాణ ప్రజలు మరచి పోరని తెలిపారు. కాంగ్రెస్ కి ఓటు వేసిన, మజ్లీస్ కి ఓటు వేసిన అది బీఆర్ఎస్ కే పోతుందని అన్నారు. ఈ మూడు కుటుంబ పార్టీలు… ఎన్నికలకు ముందు వివిధ ఎజెండాలు, నినాదాలతో వస్తాయన్నారు. ఎన్నికలు అయిపోయాక కలిసి పోతాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ 2 లక్షల కోట్లు ఇస్తే.. కేవలం తెలంగాణ కే రెండున్నర లక్షల కోట్లు కేంద్రం లోనున్న మోడీ సర్కార్ ఇచ్చిందన్నారు. వందకోట్లతో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చామన్నారు. బీసీ నీ సీఎం చేస్తామని చెబుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు… వాళ్లు బీఆర్ఎస్ లో చేరారని అన్నారు. బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే అవినీతికి పాల్పడిందని అన్నారు. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వండని తెలిపారు.
Read also: Prabhas: తీరం తాకనున్న ‘సలార్’ తుఫాన్!
మత ఘర్షణల రికార్డ్ కాంగ్రెస్ ది… బీజేపీ ఎక్కడ అధికారం లో ఉన్న వీటిని అణచి వేస్తుందని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ తో సిద్ధాంత పరమైన, రాజకీయ పరమైన పొత్తులు ఎప్పుడు ఉండవన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత అవినీతిపై విచారణ చేసి దోషులను జైల్ కి పంపిస్తామన్నారు. ఎంఐఎం పాలస్తీనా అంశం చెప్పకుండా ఇంకేమి చెప్పి ఓట్లు అడుగుతుందన్నారు. మాదిగ వర్గీకరణను స్పీడ్ అప్ చేసేందుకే కమిటీ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. రోయింగ్యలపై ఎన్ఐఏ ఆక్షన్ తీసుకుంటుందని తెలిపారు. ఇక్కడ వాళ్లు కేసీఆర్ కి ఓటు బ్యాంక్… మా దృష్టిలో రోహింగ్యాలు దేశ ద్రోహులు అన్నారు. పీఎస్ యూ లను అమ్మాలని అనేది మా విధాన పరమైన నిర్ణయమన్నారు. తెలంగాణలో పబ్లిక్ సెక్టార్ యూనిట్ లను అమ్మమని, ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు. ఎంఐఎం ఓటును ఈ సారి కాంగ్రెస్ తీసుకోబోతుంది.. అసద్ కి కాంగ్రెస్ భయం పట్టుకుందని తెలిపారు. రైతు బంధు నీ మేము ఆపమని షా అన్నారు.
Forex reserves: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల నివేదికను విడుదల చేసిన ఆర్బీఐ
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!