Revanth Reddy: ‘మన మునుగోడు – మన కాంగ్రెస్’ పోస్టర్ ఆవిష్కరణ.. రేపు మునుగోడుకు రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy:’మన మునుగోడు, మన కాంగ్రెస్’ పోస్టర్ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కరోనావైరస్ నుంచి కోలుకున్నారు. రేపు మునుగోడులో పాదయాత్రకు వెళ్లనున్నారు. ఒకే రోజు 6 మండలాల్లో పాదయాత్రకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. మన మునుగోడు, మన కాంగ్రెస్ పోస్టర్, స్టిక్కర్ విడుదల చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. రేపు 20వ తేదీన స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో 176 గ్రామాలలో జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఆగ్రామాలలో కాంగ్రెస్ జెండాలు ఎగురవేసి, రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నేతలు నివాళులు అర్పించనున్నారు. మన మునుగోడు, మన కాంగ్రెస్ పోస్టర్, స్టిక్కర్ ను ట్వీటర్ వేదకగా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.
ఆగస్టు 13న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు గతంలో రెండు సార్లు కరోనా బారిన పడిన టీపీసీసీ చీఫ్ కు మరో కోవిడ్ సోకింది. అయితే నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పాదయాత్రని చేపట్టింది. నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ దాకా సాగనున్న ఈ పాదయాత్ర వాస్తవానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రారంభంకావాల్సింది. ఈనేపథ్యంలో.. ఇలాంటి కీలక తరుణంలో రేవంత్ రెడ్డి కరోనా బారిన పడటంతో అదికాస్త వాయిదాపడిన విషయం తెలిసిందే.
Also Read
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
ఈ నెల 21న మునుగోడు ఉప ఎన్నిక కోసం అమిత్ షా రంగంలోకి దిగడానికి ముందుగానే, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారనే చర్చతో రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికను ఎంతో సీరియస్గా తీసుకుంది. అక్కడ బీజేపీకి ధీటుగా ఎన్నికల ప్రచారం చేపట్టాలని చర్యలు చేపట్టింది. దీంతో అమిత్ షా సభ కంటే ముందుగానే మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ఏర్పాట్లు షురూ చేసింది. మునుగోడులో ఈనెల 20న మధ్యాహ్నం 2 గంటలకు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
ఈనేపథ్యంలో.. టీపీసీసీ రేవంత్ రెడ్డి రేపు మునుగోడులో పాద్ర నిర్వహించనున్నారు అనే వార్త చర్చకు దారితీస్తోంది. టీఆర్ఎస్ రేపు భారీ బహిరంగ సభ, రేవంత్ రెడ్డి పాద యాత్రపై ఉత్కంఠ నెలకొంది.
Arvind Kejriwal: సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం
తాజావార్తలు
-
Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
-
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
-
Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
-
Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!