NTV Telugu Site icon

రైతులకు గుడ్‌న్యూస్‌.. 16 నుంచి రుణ మాఫీ మొత్తం జమ..

farmers

farmers

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ మొత్తం ఈ నెల 16వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమకానుంది… రాష్ట్రంలోని ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనున్నారు… బ్యాంకర్లు రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయొద్దని… పూర్తిగా రుణా మాఫీ ఖాతాలోనే ఈ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం… రుణ మాఫీ జరిగిన రైతుల ఖాతాల్లో జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో జరిగిన బ్యాంకర్ల సమావేశానికి 42 బ్యాంకుల అధికారులు హాజరుకాగా… ఈ మేరకు ఆదేశించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.