Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Advocate Pratap For Investigation Before Sit

MLA’s Poaching Case: సిట్ ఎదుట విచారణకు అడ్వకేట్ ప్రతాప్

Published Date :November 26, 2022 , 11:42 am
By NTV WebDesk
MLA’s Poaching Case: సిట్ ఎదుట విచారణకు అడ్వకేట్ ప్రతాప్
  • Follow Us :
  • google news
  • dailyhunt

MLA’s Poaching Case: ఎమ్మెల్యేల‌ కొనుగోలు కేసులో సిట్ విచారణ చేపట్టింది. నేడు సిట్ ఎదుట విచారణకు అడ్వకేట్ ప్రతాప్ హాజరయ్యారు. నిందితుడు నందకుమార్, ప్రతాప్ మధ్య జరిగిన లావాదేవీలపై సిట్ విచారించనున్నట్లు సమాచారం. ఈ కేసులో కరీంనగర్ లాయర్ శ్రీనివాస్ ను ఏ7గా చేర్చిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. శ్రీనివాస్.. నందు, సింహయాజితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి నందుతో రూ.55 లక్షల లావాదేవీలు జరిపినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు సమాచారం.

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది.. ఈ క్రమంలో అంబర్ పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్ర లేఖ ఇద్దరు విచారణ అధికారి ఎదుట హాజరయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు వారిని వేర్వేరు గదుల్లో 8 గంటలకు పైగా విచారించనున్నారు. నిందితుడు నందు, అతని భార్య చిత్రలేఖ, ప్రతాప్ గౌడ్ మధ్య పలు ఫోన్ మెసేజ్ లు, వాట్సాప్ చాటింగ్ లు, కాల్ రికార్డులను గుర్తించిన పోలీసులు వాటిపై ప్రతాప్ ను విచారించినట్లు సమాచారం. తొలుత తాను ఎవరితోనూ సంభాషించనని, సందేశాలు పంపలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కానీ పోలీసులు అతడి ముందు ఆధారాలు ఉంచి విచారించగా సమాధానం చెప్పకుండా ప్రతాప్ బోరున విలపించినట్లు తెలిసింది.

read also: Driverless Bus: డ్రైవర్ లేని బస్సులో చక్కర్లు కొట్టాలనుందా.. మీకోసం వచ్చేస్తున్నాయ్

నందుతో తనకున్న పరిచయం, ఇతర సంబంధాల గురించి ఆరా తీస్తే సమాధానం చెప్పకుండా దాటేశాడు. సాయంత్రం వరకు ప్రతాప్‌ను విచారించినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం కూడా విచారణకు హాజరు కావాలని విచారణ అధికారి ఆదేశించారు. అలాగే నందు భార్య చిత్ర లేఖపై ఆరా తీసిన సిట్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో ఆమెకు, ప్రతాప్‌గౌడ్‌, నందుక్‌ల మధ్య పలు కాల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు లభ్యమయ్యాయి. ఆ మెసేజ్‌లలో ఏ సమాచారం ఉంది, ఎందుకు చేశారంటూ చిత్రలేఖను ప్రశ్నించగా.. తనకు తెలియదని, గుర్తులేదు నాకు రాలేదని వింత సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఆమెకు చెందిన డెక్కన్ కిచెన్, నివాసంలోని సిసి రికార్డులలో నమోదైన ఫోటోలను ఆమెకు చూపించి, వారు ఎవరు? ఎందుకు వచ్చారు? అని ఆమెను అడిగారు. అయితే తాను డైరెక్టర్‌గా ఉన్న సంస్థ కార్యకలాపాలు, లావాదేవీలపై చిత్రలేఖ దాటివేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె ఉద్దేశపూర్వకంగా వ్యవహరించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

విచారణ నిమిత్తం 41ఏ నోటీసుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ స్టే తెచ్చుకోవడంతో తదుపరి ఏం చేయాలనే దానిపై సిట్ అధికారులు కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరొక నోటీసు ఇవ్వాలా? లేక డిసెంబర్ 5 వరకు వేచి చూడాలా అన్నదానిపై సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే విచారణ వేగవంతం కావడంతో రోజురోజుకు మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. నందు, రామచంద్ర భారతి, సింహయాజీ స్కాంలు బయటకు వస్తున్నాయి. కేంద్రంలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తామంటూ లక్షలు వసూలు చేశారని అధికారులు గుర్తిస్తున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి నుంచి రూ.60 లక్షలు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు.
Heart Surgery in Darkness: చీకట్లోనే చిన్నారికి గుండె చికిత్స.. వీడియో వైరల్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Advocate Pratap
  • investigation
  • MLAs Poaching Case
  • SIT

తాజావార్తలు

  • CM and Deputy CM Key Meeting: రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. వరుస ఘటనల నేపథ్యంలో ప్రాధాన్యత..!

  • Hanuman Day Importance: మంగళవారం ఈ 5 వస్తువులను కొంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి..

  • Lunar Eclipse 2026: ఈ చంద్రగ్రహణం మీ జీవితాన్ని మారుస్తుందా?.. రాశి ఫలితాలు, పరిహారాలు ఇవే!

  • Iran: ఖమేనీ భార్య కూడా మృతి.. ఇరాన్ ప్రకటన

  • Pete Hegseth: అమెరికాను బెదిరిస్తే.. ఎక్కడున్నా అంతుచూస్తాం.. ఇరాన్‌కు అమెరికా రక్షణమంత్రి వార్నింగ్

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions