Etela Rajender: కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రంలో మోదీ నాయకత్వంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి భేష్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మోదీ 8 ఏళ్ల పాలన గురించి మెదక్ లో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 కు ముందు కేసీఆర్ ఏం మాట్లాడాడు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నాడో చెప్పాలి అని ప్రశ్నించాడు. కేసీఆర్ మాటలు, చేతలకు పొంతన ఉండదని అన్నారు. కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే అని ఆయన అన్నారు.
గెలిపించిన ఖర్మకి అనుభవిస్తున్న నరకం ఎప్పుడు పోతుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..టీఆర్ఎస్ ను ప్రజలు ఇంటికి సాగనంపుతారని అన్నారు. ఇక నేను గెలవలేననే భయంతో ఎక్కడో బీహార్ లో ఉన్న పీకే లాంటి వారిని తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రజలను గోల్ మాల్ చేసి దోపిడీ చేసేందుకు పీకేలాంటి వారు పనిచేస్తారని అన్నారు. రూ.600 కోట్ల కాంట్రాక్ట్ తో పీకే పనిచేస్తున్నారని ఆరోపించారు.
Also Read
హుజూరాబాద్ ఎన్నికల్లో నన్ను ఓడగొట్టేందుకు జిల్లా మంత్రి హరీష్ రావు పని చేసిండని ఆరోపించారు. పీకే సర్వేలు తెలంగాణలో పనిచేయవని ఆయన అన్నారు. రైతులకు ఏక కాలంలో రూ. లక్ష రుణమాఫీ చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పులకు తీసుకెళ్లిండని విమర్శించారు. తెలంగాణలో ఒక్కో వ్యక్తిపై రూ. 1.25 లక్షల అప్పు ఉందని.. కాదని చెప్పమనండి నేను చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. మద్యం ద్వారా రూ. 40 వేల కోట్లు ఆదాయం వస్తుందని.. తెలంగాణ తాగుడుకు బానిస అయిందని అన్నారు ఈటెల రాజేందర్.
గుడుల పక్కన, స్కూల్స్ పక్కన మద్యం దుకాణాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. నష్టపరిహారం ఇవ్వమన్న గౌరవెల్లి రైతులపై లాఠీఛార్జి చేయించారని, డబ్బులు తీసుకోండి, దావతులు చేసుకోండి కానీ టీఆర్ఎస్ కు ఓటేయకండి అంటూ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ విశ్వనీయత కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ కు వెళ్లినట్లే అంటూ ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!