NTV Telugu Site icon

Abhishek Singhvi: నేడు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్..

Abhishek Singhvi

Abhishek Singhvi

Abhishek Singhvi:ఎమ్మెల్యేల కోటా రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వి నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆయన ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆదివారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని షెరటన్‌ హోటల్‌లో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్‌పీఏ) సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రేవంత్‌ సింఘ్వీని పరిచయం చేశారు. సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు.

Read also: Kaleshwaram Project: నేటి నుంచి జస్టిస్‌ పీసీ ఘోష్‌ విచారణ..

కాగా.. రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె.కేశరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ధృవీకరించింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించడమే సీఎల్ ఎఫ్ సమావేశంలో ప్రధాన ఎజెండా. దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాలపై చర్చిస్తారని తెలిసింది. అలాగే, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన సింఘ్వి.. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
T20 World Cup 2025: టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల.. వెస్టిండీస్‌తో భారత్‌ తొలి మ్యాచ్!