Warangal Crime: వరంగల్ లో దారుణం.. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక సమాచారంతో ఘటన స్థాలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా కాజీపేట మండలంలోని ఓ వెంచర్లో వివాహిత దారుణ హత్యకు గురైంది. ముఖంపై బండ రాయితో మోదీ విచక్షణా రహితంగా హత్యచేశారు గుర్తు తెలియని దుండగులు. బుధవారం సాయంత్రం భట్టుపల్లి, అమ్మవారిపేట మధ్య వెంచర్లో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి చెట్ల పొదల్లో రక్తపు మడుగులో యువతి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. అంతే షాక్ తిన్న ఆ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మహిళ ముఖం గుర్తు పట్టలేనంతగా ఆమెను బండరాయితో మోదీ అతిదారుణంగా హత్య చేశారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న సెంట్రల్ డీసీపీ ఎంఏ బారి, కాజీపేట ఏసీపీ తిరుమల్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఎస్సైలు రాజబాబు, దివ్య హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంకా రక్తం తడి ఆరకపోవడం మధ్యాహ్నం తరువాతే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హత్య జరిగిన స్థలంలో బ్యాగు, మహిళ పర్సు, మృతురాలి చెప్పులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Also Read
Read also: Hyderabad Metro: మెట్రో రైల్ లో సాంకేతిక లోపం.. తెరుచుకోని మెట్రో డోర్లు
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో.. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. మృతురాలు పర్సులో లభించిన ఆధార్ కార్డు బట్టి ఆమెను దర్గాకాజీపేట లోని లావుడ్యా తండాకు చెందిన లావుడ్యా కుమార్ భార్య లావుడ్యా యామిని అలియాస్ కుమారిగా గుర్తించారు పోలీసులు. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాట్లు గుర్తించారు. అయితే.. ఆమె ఇక్కడకు ఎందుకు వచ్చిందో.. ఎవరు హత్య చేశారో అనే వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసు కొని అన్ని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే తన భర్త లావుడ్యా కుమార్ భార్య మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయలేదని పేర్కొన్నారు. భర్త లావుడ్యా కుమార్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!