Mancherial: ఇంత దారుణమా.. ఎడ్లు పెరట్లో మేశాయని రైతుపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mancherial: నేటి కాలంలో ప్రజలు అహంకారంగా తయారవుతున్నారు. నేడు ప్రజలంతా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎదటి వారిని చూస్తే అసలు సహించలేకపోతున్నారు. మనుషులం అన్న సంగతి మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. కులమతాల పేరుతో ఎదుటి వారిపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎదుటివారు కూడా మనుషులే అనేది మరిచి వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కుల, మత అనే అహంకారంతో ఎదువారికి చిన్న చూపు చూస్తున్నారు. సభ్యసమాజం తలదించుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Shamshabad: శంషాబాద్ పరిధిలో మరో దిశ ఘటన.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పు..!
Also Read
మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం శెట్పల్లికి చెందిన దుర్గం బాపు అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన సూరం రాంరెడ్డి అనే వ్యక్తి కొయ్యకు కట్టేసి బంధించాడు. గురువారం మధ్యాహ్నం బాపు ఎడ్లు రాంరెడ్డి యార్డుకు వెళ్లి మొక్కలు మేపారు. ఈ విషయం తెలుసుకున్న రాంరెడ్డి తన ఇంటి ఆవరణలో ఎడ్లను కట్టి పొలానికి వెళ్లాడు. బాపు వచ్చి ఎడ్లను విడిపించుకుని తీసుకెళ్లడంతో రామ్ రెడ్డికి కోపం వచ్చింది. ఇంటికి వచ్చిన రాంరెడ్డి ఎడ్లు కనిపించకపోవడంతో నేరుగా బాపు ఇంటికి వెళ్లి దూషించాడు. బాపును ఇంటికి తీసుకొచ్చి పశువులను కట్టే గుంజకు కట్టి కొట్టాడు. ఇదంతా 20 నిమిషాల పాటు సాగింది. మరోవైపు బాపు పట్ల రాంరెడ్డి తీరును గ్రామస్తులు తప్పుబట్టి విడిపించారు. రాత్రి వరకు జరిగిన చర్చల అనంతరం బాపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంరెడ్డి తనను కులం పేరుతో దూషించాడని, ఇంటికి తీసుకెళ్లి కొయ్యకు కట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాపును కులం పేరుతో దూషించిన నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోవైపు బాపును బంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Astrology: ఆగస్టు 11, శుక్రవారం దినఫలాలు
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?