Cyber Scam: మల్టీ లెవెల్ మార్కెటింగ్.. వైన్ కొనండి కొనిపియ్యండంటూ కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Scam: మల్టీ లెవెల్ మార్కెటింగ్లో చేరి చాలా మంది మోసపోతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. వైన్ కంపెనీలో పెట్టుబడి పెట్టండి.. మీరు వైన్ బాటిల్ కొనుక్కోండి.. 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తాం.. మీరు చేరితే నెల జీతం ఇస్తామని కొందరు చేసిన ప్రకటనను గుడ్డిగా నమ్ముతున్నారు. డబ్బులు వస్తాయన్న ఆశతో వేల, లక్షలు పెట్టుబడి పెట్టారు. కొద్దిరోజులకు చెప్పినట్టుగానే రెట్టింపు పెట్టుబడి ఇచ్చారు. పూర్తిగా ఒప్పించే వరకు టైం ప్రకారం డబ్బులు చెల్లిస్తారు. ఇక పెట్టుబడి వేలకు పెరిగి, లక్షలు కోట్లకు చేరుకుంటున్న సమయంలో గొలుసుకట్టు వ్యాపారాన్ని నిర్వాహకులు వెంటనే బ్రేక్ చేశారు. బాధితులకు టోపీ ఇచ్చి పారిపోయారు. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు. ఈ వైన్ కంపెనీ మోసంలో తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఎక్కువ మంది మంచిర్యాల జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.
Read also: Crispy Gobi 65 : రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
టిడబ్ల్యుజి పేరుతో వాట్సాప్ గ్రూప్ను రూపొందించారు. కొన్ని సంఖ్యలు జోడించబడ్డాయి. తాము వైన్ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నామని గ్రూపులో చేరిన వారికి చెప్పారు. వారికి లింక్ పంపారు. లింక్ ద్వారా పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఒక్క సీసా వైన్ కొంటే 60 రోజుల్లో మూడు సార్లు ఇస్తారు. రూ. 85 వేలకు వైన్ బాటిల్ కొంటే ప్రతిరోజు రూ. 12,300 చెల్లిస్తారు. కొందరికి కొద్దిరోజులు సక్రమంగానే జీతాలు ఇచ్చారు. వారి మాటలు నమ్మి వేలల్లో పెట్టుబడి పెట్టారు. నిర్వాహకులు అక్కడితో ఆగలేదు. ప్రత్యేకమైన యాప్ను రూపొందించారు. గోవాలో నిర్వహణ ఉందన్నారు. అక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతామని రిమోట్ అయింది. వైన్ బాటిల్ పై పెట్టుబడి పెట్టడమే కాకుండా 230 మందిని చైన్ సిస్టమ్ లో చేర్చుకుంటే ప్రతి నెలా రూ. 20 వేల వరకు జీతం వస్తుందని చెప్పారు. డబ్బు వస్తుందనే ఆశతో చాలా మంది అందులో చేరారు. ఆ వైన్ బాటిల్ కొనడానికి రోజూ డబ్బులు ఇచ్చేవారు.
మే 30 వరకు నగదు చెల్లింపు లావాదేవీలు సజావుగా సాగాయి. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. నిర్వాహకులు మే 30 నుండి కస్టమర్లకు డబ్బు ఇవ్వడం ఆపివేశారు. కస్టమర్లు పేమెంట్ చేయకపోవడంపై మెసేజ్ల ద్వారా మేనేజర్లను సంప్రదించారు. కానీ గోవా, ఢిల్లీలో ఉన్నామని చెప్పి బాధితుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బకాయి ఉన్న డబ్బులు చెల్లించాలంటే సర్వర్ కొని పేపాల్ కొనుక్కోండి అన్నారు. రూ.4 వేల నుంచి రూ.20 వేలు పెట్టుబడి పెడితే మిగిలిన డబ్బులు ఇస్తామని ఇప్పటికీ నమ్ముతున్నారు. దాంతో కొంత మంది ఆ మాటలు విని రూ. 8 వేలు ఇచ్చి సర్వర్ కూడా కొనుగోలు చేశారు. మూడు రోజులు గడుస్తున్నా ఇంకా డబ్బులు చెల్లించలేదు. అదేమని అడిగితే మళ్లీ పేపాల్ యాప్ కొనుక్కో.. రెండు గంటల్లో డబ్బులు వస్తాయని చెబుతున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు కూలి పనులకు వెళ్తున్నామని వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Ancient Sculpture Found : పోలాకిలో లభించిన పురాతన శిల్పం
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!