Stephen Raveendra: ఫేక్ సర్టిఫికెట్లతో బ్యాంకుల నుంచి రుణాలు.. 18 మంది అరెస్టు
Stephen Raveendra: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో బ్యాంకులు నుండి రుణాలు ఇప్పిస్తున్న 18 ముఠాను అదుపులో తీసుకున్నామని అన్నారు. భారీగా ఫేక్ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, సర్టిఫికెట్లను పొంది వాటి ద్వారా బ్యాంకులో రుణాలు తీసుకుంటున్న ముఠాను పట్టుకున్నామని అన్నారు. మొత్తం పది కోట్ల రూపాయల విలువైన సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 687 రబ్బర్ స్టాంపులు, 1180 ఫేక్ సర్టిఫికెట్లు, 10 ల్యాప్టాప్ లు, 57 సెల్ఫోన్లు, స్టాంప్ మేకింగ్ మెషీన్లు, స్టాంప్ ఫ్లాషర్స్ లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ హౌస్ పర్మిషన్ సర్టిఫికెట్లను సైతం ఈ ముఠా ఇస్తుందన్నారు. కుకట్పల్లి, కేపిహెచ్బి లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎస్ఓటీ ఈ ముఠా గుట్టురట్టు చేసిందని వెల్లడించారు.
Read also: MLA Raja Singh: కలిసి సినిమా చూద్దాం రండి.. కేటీఆర్ కు రాజాసింగ్ ఆహ్వానం
Also Read
- DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
- TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
- TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
- Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
ఈ ముఠాకు ప్రధాన నిందితుడు రంగారావు అని, రంగారావు ఈ సర్టిఫికెట్లను తయారు చేస్తాడని తెలిపారు. బ్యాంకులు నుండి రుణాలు ఇప్పిస్తాడని, 2005, 2012 లో అరెస్టు అయ్యాడని వెల్లడించారు. 2015 నుండి ఈ ముఠా నడుస్తుందని, మొత్తం మూడు టీమ్ లు పని చేస్తాయని తెలిపారు. ఫేక్ రబ్బర్ స్టాంపులు తయారు చేయడం ఒక ముఠా, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తదితర బ్యాంకులు నుండి రుణాలు తీసుకుంటున్నారని అన్నారు. మరో ముఠా బిజినెస్ లోన్ లు ఇప్పిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని అన్నారు. లేబర్ లైసెన్స్, జీహెచ్ఎంసీ ట్రేడ్ సర్టిఫికెట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ లను తయారు చేస్తున్నారని తెలిపారు. వీటి ద్వారా బిజినెస్ లోన్లు ఇప్పిస్తున్నారని, ఫేక్ లే అవుట్ కి మూడు వేలు, బ్యాంకు రుణాలు కోసం సర్టిఫికెట్లను ఇప్పించేందుకు ఐదు వేలు తీసుకుంటున్నారని అన్నారు. బ్యాంకుల సిబ్బంది పాత్ర పై ఆరా తీస్తున్నామని తెలిపారు. వాళ్ళ పాత్రపై ఆధారాలు దొరికితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు పాత్రపై ఆరా తీస్తామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
Prabhas: యుద్ధానికి సిద్ధమవ్వండి… డైనోసర్ ట్రైలర్ వస్తుంది
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!