BJP MLAs: బీజేపీ అభ్యర్థి, ఇద్దరు ఎమ్మెల్యేలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు ఖానాపూర్ పోలీసులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నిన్న రోడ్ షోలో పర్మిషన్ ఇచ్చిన సమయాన్ని దాటి ప్రచారం చేసినందుకు బీజేపీ పార్టీ అభ్యర్థి గోడం నగేష్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహేందర్ బీజేపీ మండల పార్టీ కన్వీనర్ లపై VST (వీడియో సర్వేలెన్సు టీం) ఇన్చార్జి ఫిర్యాదు చేశారు. దీంతో ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి ఖానాపూర్, ఇచ్చోడలో నిర్వహించిన రాస్తారోకోలో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, రాజేశ్వర్ రెడ్డి, రితీష్ రాథోడ్ పాల్గొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా ఫేక్ వీడియోలు సృష్టించారని ఆరోపించారు.
Read also: Kedarnath Yatra: ముస్తాబైన కేదార్ నాథ్ ఆలయం.. రేపు తెరచుకోనున్న గుడి తలుపులు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, అధికారం కోసం ఏమైనా చేస్తారని విమర్శించారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని, ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ వేల కోట్లు మంజూరు చేశారని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని గతంలో హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు జరిగినట్టే రేవంత్ రెడ్డికి కూడా జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ప్రచారంలో అధికారులు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ సమయం ప్రచారానికి కేటాయించారని వీఎస్ టీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేశారు.
Kalvan OTT: ఓటీటీలోకి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?