BJP MLAs: ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ పై కేసు నమోదు.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLAs: బీజేపీ అభ్యర్థి, ఇద్దరు ఎమ్మెల్యేలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు ఖానాపూర్ పోలీసులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నిన్న రోడ్ షోలో పర్మిషన్ ఇచ్చిన సమయాన్ని దాటి ప్రచారం చేసినందుకు బీజేపీ పార్టీ అభ్యర్థి గోడం నగేష్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహేందర్ బీజేపీ మండల పార్టీ కన్వీనర్ లపై VST (వీడియో సర్వేలెన్సు టీం) ఇన్చార్జి ఫిర్యాదు చేశారు. దీంతో ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి ఖానాపూర్, ఇచ్చోడలో నిర్వహించిన రాస్తారోకోలో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, రాజేశ్వర్ రెడ్డి, రితీష్ రాథోడ్ పాల్గొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా ఫేక్ వీడియోలు సృష్టించారని ఆరోపించారు.
Read also: Kedarnath Yatra: ముస్తాబైన కేదార్ నాథ్ ఆలయం.. రేపు తెరచుకోనున్న గుడి తలుపులు
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, అధికారం కోసం ఏమైనా చేస్తారని విమర్శించారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని, ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ వేల కోట్లు మంజూరు చేశారని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని గతంలో హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు జరిగినట్టే రేవంత్ రెడ్డికి కూడా జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ప్రచారంలో అధికారులు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ సమయం ప్రచారానికి కేటాయించారని వీఎస్ టీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేశారు.
Kalvan OTT: ఓటీటీలోకి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజావార్తలు
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
-
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
-
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!