ప్రపంచంలోనే పెద్దాస్పత్రి.. 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వరంగల్ మీడియాతో మాట్లాడిన ఆయన… ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారని వెల్లడించారు.. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరుగుతుందని.. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని.. ఆ తర్వాత కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న బోజనం చేసి యాదాద్రికి బయల్దేరుతారని తెలిపారు.
సెంట్రల్ జైల్ స్థలంలో 30 అంతస్థుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని.. ప్రస్తుతం కెనడాలో మాత్రమే 24అంతస్తుల ప్రభుత్వ ఆస్పత్రి అందుబాటులోఉందని గుర్తుచేశారు ఎర్రబెల్లి.. వరంగల్ లో నిర్మించే 30 అంతస్తుల ఆస్పత్రి ప్రపంచంలోనే అతిపెద్దదన్న ఆయన.. ఆస్పత్రులు వస్తే బీజేపీ నేతలను నష్టం ఏంటి..? అంటూ ఫైర్ అయ్యారు.. బీజేపీ నేతలు కోర్టుకు పోయి ఆస్పత్రి నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. మీ పార్టీలో చేరిన వారంతా భూములు ఆక్రమించుకున్న వారే నంటూ ఎద్దేవా చేశారు.. వరంగల్ జిల్లా సస్యశ్యామలం కావడం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఉందని ప్రశంసలు కురిపించిన ఎర్రబెల్లి.. కరోనా సమయంలో కేంద్రం విఫలమైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి మెరుగైన వైద్యం అందించిందన్నారు.. కాగా, వరంగల్లో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం వరంగల్ సెంట్రల్ జైలును అక్కడి నుంచి తరలించిన సంగతి తెలిసిందే.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
తాజావార్తలు
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!