Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ వద్ద 144 సెక్షన్.. రాహుల్ తో పాటు వారికి మాత్రమే అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medigadda Barrage: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఉదయం కూలిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని ఇవాళ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో కలిసి రాహుల్ గాంధీ పరిశీలించారు. మరికొందరు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు అనుమతించలేదు. రాహుల్ గాంధీ, ఇతర నేతలు బ్యారేజీ కూలిన పిల్లర్లను పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బ్యారేజీని పరిశీలించేందుకు రాహుల్తో పాటు ఆరుగురిని మాత్రమే అనుమతించారు. ప్రాజెక్ట్ సైట్ వద్ద సెక్షన్ 144 అమలులో ఉన్నందున, పరిమిత సంఖ్యలో సందర్శకులను మాత్రమే అనుమతించారు. అయితే.. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మేడిగడ్డ బ్యారేజీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లక్ష కోట్లతో నిర్మించిన బ్యారేజీ రెండేళ్లలోనే కుప్పకూలడం దురదృష్టకరమని, ప్రాజెక్టుకు విడుదల చేసిన డబ్బులో సగం దోచుకోవడం వల్లే నాణ్యత లేని ప్రాజెక్టును నిర్మించారని రాహుల్ ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని, నిధులను పూర్తిగా ఖర్చు చేయకుండా దోపిడీ చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థల అధినేత అమిత్ షా.. అవినీతిపై మోదీ చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రాజెక్టులు బాగుపడతాయన్నారు. రాహుల్ వెంట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు.
Also Read
ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలింది. బ్యారేజీకి చెందిన రెండు పిల్లర్లు కూలిపోయాయి. ఈ బ్యారేజీ ఎగువ నుంచి తెలంగాణ, మహారాష్ట్రలకు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే బ్యారేజీ కుప్పకూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ బ్యారేజీ కూలిపోవడాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. ఈ మేరకు కేంద్ర జల విద్యుత్ మంత్రిత్వ శాఖకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. ఈ మేరకు కేంద్ర జల విద్యుత్ మంత్రిత్వ శాఖకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించింది. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి నీటి పారుదల శాఖ అధికారులను జలమండలి కొన్ని ప్రశ్నలు అడగగా, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరింది. రాహుల్ గాంధీ ఈ ఉదయం హెలికాప్టర్ లో అంబట్ పల్లి గ్రామానికి చేరుకున్నారు. మహిళా సాధికారత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు.
WhatsApp: వాట్సాప్లో మరో సూపర్ ఫీచర్..ప్రొఫైల్ ను సేఫ్టీగా ఉంచుతుంది..
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!