NTV Telugu Site icon

Revanth Reddy: దేశంలోనే నెంబర్-1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చారు

Revanth Reddy

Revanth Reddy

నర్సాపూర్ లో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చీమలు బారులు తీరినట్లుగా ఈ సభకు వేలాదిగా తరలివచ్చిన మీకు అభినందనలు.. నాయకులు పదవుల కోసం అమ్ముడుపోయినా కార్యకర్తలు పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారు అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఒక నమ్మక ద్రోహికి బీఆర్ఎస్ ఇక్కడ టికెట్ ఇచ్చింది.. నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుంది.. నర్సాపూర్ లాంబాడి సోదరుల అడ్డా.. లాంబాడాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేం లేదు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Animal : యానిమల్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

అధికారంలోకి రాగానే నర్సాపూర్ పరిధిలోని లంబాడా తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది అని రేవంత్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారు.. మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నెంబర్-1 అని చెప్తుండు.. రైతుల ఆత్మహత్యల్లో నెంబర్-1 …నిరుద్యోగ సమస్యల్లో నెంబర్ వన్.. దేశంలోనే నెంబర్-1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చారు అని ఆయన తెలిపారు. అమ్ముడు పోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు.. కేసీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి కౌంటర్.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని కేసీఆర్ అంటుండు.. ఇందిరమ్మ రాజ్యం అంటే మా లాంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని రేవంత్ రెడ్డి అన్నారు.

Read Also: Bigg Boss Telugu 7: అమర్ మాటలకు రెచ్చిపోయిన యావర్.. ఈ వారం నామినేషన్స్ లో వారే?

తండాల్లో మారుమూల పల్లెల్లో పేదలకు నిలువ నీడనిచ్చి.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని రేవంత్ రెడ్డి అన్నారు. భూమి ఆత్మగౌరవం.. 25లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసింది ఇందిరమ్మ రాజ్యం.. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి సాగునీరు అందించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే.. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం అడక్కు తినేది.. కేసీఆర్, సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ గా నీకు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం.. కాంగ్రెస్ కాదా? కేసీఆర్.. ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిన్ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అనే సంగతి మరిచిపోయావా? అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.