Revanth Reddy: కాంగ్రెస్ ఘనవిజయం ఖాయం.. మళ్లీ విజయోత్సవ సభకు వస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Revanth Reddy: పార్టీ ఫిరాయించిన ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ను కూడా అసెంబ్లీ గేటు తాకనియోద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నల్గొండ జిల్లా నకిరేకల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే.. కేసిఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఇసుకలో మేడిగడ్డ బ్యారేజి కట్టిన అవినీతి చరిత్ర కేసిఆర్ది.. కాంగ్రెస్కు పేరు వస్తుందని Slbc నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు. హైదరాబాద్లో కేసీఆర్ 10 వేల ఎకరాలను ఆక్రమించాడన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని, మళ్ళీ విజయోత్సవ సభకు వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండని, కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదన్నారు. ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో కేసీఆర్ ముందుకెళ్లిండని, కానీ వెంకట్ రెడ్డిగారు తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదని గుర్తు చేశారు. చిరుమర్తి లింగయ్యను రెండుసార్లు గెలిపిస్తే పార్టీని నమ్ముకున్న కార్యకర్తల గుండెలపై తన్నిండని, పార్టీ ఫిరాయించి దొరగారి గడీలో మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండంటూ ధ్వజమెత్తారు.
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
Also Read: Vivek: భూస్వాములకు రైతుబంధు ఎందుకు..? కౌలు రైతులకు అండగా కాంగ్రెస్..
పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనీయొద్దని ప్రజలకు పిలుపినిచ్చారు. అక్కడి సూర్యుడు ఇక్కడమొలిచినా.. ప్రాణం పోయినా.. ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనివ్వొద్దు.. ఇప్పుడు మీరు ఇవ్వబోయే తీర్పు వందేళ్ల వరకు చరిత్రలో నిలిచిపోవాలన్నారు. ఆనాడు వెంకన్న వైఎస్తో కొట్లాడి ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 3 లక్షల 60 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టు మంజూరు చేయించారు.. ఉమ్మడి రాష్ట్రంలో 30 కిలోమీటర్లు టన్నెల్ తవ్వారు. ఇంకో పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చేవి తెలిపారు. కానీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, కాంగ్రెస్కు పేరు వస్తుందనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పడావు పెట్టారన్నారు. నకిరేకల్ వేదికగా కేసీఆర్ను సూటిగా అడుగుతున్నా… ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదు? ప్రశ్నించారు.
కేసీఆర్ బక్కోడు కాదు.. మేల్కొంటే బకాసురుడు.. పడుకుంటే కుంభకర్ణుడు అంటూ విమర్శించారు. 60 ఏళ్లల్లో 16 మంది సీఎంలు చేసిన అప్పు 69 వేల కోట్లు.. కానీ పదేళ్లలో కేసీఆర్ కుటుంబం చేసిన అప్పు 6 లక్షల కోట్లుని తెలిపారు. ఎవడు దొంగ.. ఎవడు గజదొంగ తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, కేటీఆర్.. మీ అయ్య వంద నోటులాంటి వాడు కాదు.. దొంగనోటు లాంటివాడని విమర్శించారు. నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా… ఉమ్మడి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. జిల్లాలో 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించాలని, కేసీఆర్ను, బీఆర్ఎస్ను డిసెంబర్ 9న బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మీదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!