Bhatti Vikramarka: మాదాపూర్, హైటెక్ సిటీలా.. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గాన్ని మాదాపూర్, హై టెక్ సిటీ, కొండాపూర్లాగా కేఎల్ఆర్ అభివృద్ధి చేస్తారన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్. బుధవారం కాంగ్రెస్ నేత కిచ్చాన్నగారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఆయన మహేశ్వరం నియోజకవర్గంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కేఎల్ఆర్ అంటే నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు భూములను ఆక్రమంచుకోడం తప్పా వేరే పనులేవీ చెయ్యడం లేదని సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజల కోసం లక్ష్మారెడ్డి పనిచేస్తారని, కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో నీ తుచా తప్పకుండా అమలు చేయడంలో ముందు ఉంటారన్నారు.
Also Read: India-Canada: కెనడా పౌరుల కోసం ఈ-వీసా పున:ప్రారంభించనున్న భారత్..
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
పార్టీ కోసం సొంత డబ్బులతో ఖర్చులు పెట్టీ పనిచేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు బీఆర్ఎస్లోకి వెళ్ళారని పేర్కొన్నారు. ఆమె పార్టీ వీడితే కాంగ్రెస్కి నష్టం జరుగుతుందని భావించారు…కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెక్కుచెదరకుండా ఉన్నారన్నారు. అయితే అటువంటి సబితా ఇంద్రారెడ్డి కి ఈసారి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన లేదు.. రెషన్ కార్డులు ఇవ్వలేదు… దళిత బందు ఇవ్వలేదు.. ఆరోపించారు. ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెసే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికి పంపిస్తమన్నారు.
Also Read: KLR: గడీల పాలన వద్దు… అందరి పాలన కావాలి: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
రాష్ట్రం వస్తే మన సంపద మనది అవుతుందని అనుకున్నాం.. కానీ, సంపద రాకపోగా అప్పులు వచ్చాయన్నారు. సంపద మొత్తం BRS నేతలు పందికొక్కుల్లగా తిన్నారు కాబట్టి ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదంతా కక్కిస్తామని, సంపద నీ పంచడం కోసమే కాంగ్రెస్ 6 గ్యారెంటీ లు తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సంపదని ప్రజలకు పంచుతామని తెలిపారు. ఈసారి మహేశ్వరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో KLR నీ గెలిపించాలని ఆయన కోరారు. తమకున్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టబోతుందని ఆయన అన్నారు. అనంతరం దొరల ప్రభుత్వం పోవాలి… ప్రజల ప్రభుత్వం రావాలి అంటూ భట్టి నినాదించారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!