India-Canada: కెనడా పౌరుల కోసం ఈ-వీసా పున:ప్రారంభించనున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదంగా మారింది. ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడాలోని భారత రాయబారిని అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా తీవ్రంగానే స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ వదిలివెళ్లాలని ఆదేశించింది. ఇదే కాకుండా కెనడియన్ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే దాదాపు రెండు నెలల విరామం తర్వాత కెనడియన్ పౌరులకు ఈ-వీసా సేవల్ని భారత్ తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.. దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో సెప్టెంబర్ 21న వీసాల సేవలను నిలివేశారు. టూరిస్ట్ వీసాలతో సహా అన్ని వీసా సేవల్ని ప్రస్తుతం పునరుద్ధరించనుంది. బిజినెస్, మెడికల్ వీసాలు గత నెలలోనే ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ నెలలో తదుపరి నోటీసులు వచ్చే వరకు వీసాలు నిలిపేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
Also Read
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
Read Also: Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. !
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదానికి కారణమైంది. తమ వద్ద నమ్మదగిన ఆరోపణలు ఉన్నాయని ఆయన అక్కడి పార్లమెంట్లో ప్రకటించారు. అయితే భారత్ కెనడా వ్యాఖ్యల్ని అసంబద్ద, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టేసింది. అయితే కెనడా తన మిత్ర దేశాల సాయంతో భారత్ పై ఒత్తిడి పెట్టేందుకు ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. కెనడా ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఇవ్వాలని, ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని వెల్లడించారు. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ నిలిచిపోవడానికి కారణమైంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారా ముందు గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. భారత ప్రభుత్వం 2020లో అధికారికంగా నిజ్జర్ని ఉగ్రవాదిగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
-
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
-
Upcoming Smartphones: హువావే, లావా, షియోమి, మోటరోలా నుంచి.. జూన్ మొదటి వారంలో విడుదలయ్యే 5G స్మార్ట్ఫోన్స్ ఇవే
-
Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
-
IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..