India-Canada: కెనడా పౌరుల కోసం ఈ-వీసా పున:ప్రారంభించనున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదంగా మారింది. ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడాలోని భారత రాయబారిని అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా తీవ్రంగానే స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ వదిలివెళ్లాలని ఆదేశించింది. ఇదే కాకుండా కెనడియన్ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే దాదాపు రెండు నెలల విరామం తర్వాత కెనడియన్ పౌరులకు ఈ-వీసా సేవల్ని భారత్ తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.. దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో సెప్టెంబర్ 21న వీసాల సేవలను నిలివేశారు. టూరిస్ట్ వీసాలతో సహా అన్ని వీసా సేవల్ని ప్రస్తుతం పునరుద్ధరించనుంది. బిజినెస్, మెడికల్ వీసాలు గత నెలలోనే ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ నెలలో తదుపరి నోటీసులు వచ్చే వరకు వీసాలు నిలిపేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
Read Also: Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. !
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదానికి కారణమైంది. తమ వద్ద నమ్మదగిన ఆరోపణలు ఉన్నాయని ఆయన అక్కడి పార్లమెంట్లో ప్రకటించారు. అయితే భారత్ కెనడా వ్యాఖ్యల్ని అసంబద్ద, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టేసింది. అయితే కెనడా తన మిత్ర దేశాల సాయంతో భారత్ పై ఒత్తిడి పెట్టేందుకు ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. కెనడా ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఇవ్వాలని, ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని వెల్లడించారు. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ నిలిచిపోవడానికి కారణమైంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారా ముందు గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. భారత ప్రభుత్వం 2020లో అధికారికంగా నిజ్జర్ని ఉగ్రవాదిగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!