TikTok: భారత్లోకి మళ్లీ టిక్టాక్ ప్రవేశం?
- మస్క్ చేతుల్లోకి టిక్టాక్?
- భారత్లో ఈ యాప్పై గతంలో నిషేధం
- మస్క్ చేతుల్లోకి వస్తే భారత్లోకి టిక్టాక్ ప్రవేశించే అవకాశం?
భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్టాక్, షేరిట్ సహా 59 యాప్లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు జూన్ 29, 2020 ఒక ప్రకటనలో తెలిపింది. లద్దాఖ్లోని గాల్వన్ లోయలో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం నిషేధించిన 59 యాప్ల జాబితాలో టిక్టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్, షేరిట్ వంటి చైనా యాప్లు అధికంగా ఉన్నాయి. కాగా.. భారత్లో టిక్టాక్, హలోల నిషేధం తర్వాత వాటి మాతృ సంస్థ బైట్డాన్స్ భారీ నష్టాన్ని మూటగట్టుకోనున్నట్లు తెలుస్తోంది. చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. భారత్లో నిషేధం తర్వాత బైట్డాన్స్ 6 బిలియన్ డాలర్లు (రూ.45 వేల కోట్లు) నష్టపోయిందని సమాచారం.
READ MORE: PM Modi: దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
Also Read
- OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
- iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED - ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
- Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
- Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
కాగా.. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చైనాకు వ్యతిరేకంగా కఠిన వైఖరి అవలంబించడంపై ట్రంప్ పలు సందర్భాల్లో మాట్లాడారు. దీని తర్వాత, టిక్టాక్పై నిషేధంపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే యూఎస్ చట్టసభ సభ్యులు ఈ యాప్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్ కాంగ్రెస్ మాత్రం గత సంవత్సరం నిషేధానికి అనుకూలంగా ఓటు వేసింది. ఇప్పటికే టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ యూఎస్ సుప్రీం కోర్ట్లో టిక్టాక్ నిషేధాన్ని సవాలు చేసింది. యుఎస్లో నిషేధాన్ని నివారించడంలో టిక్టాక్ విఫలమైతే, దానిని మస్క్కు అప్పగించవచ్చని బ్లూమ్బెర్గ్ నివేదించింది. యూఎస్ జనాభాలో దాదాపు సగం మంది టిక్టాక్ని ఉపయోగిస్తున్నారు. దాదాపు 170 మిలియన్ల మంది ప్రజలు దీనిని వాడుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు టిక్టాక్ యాప్ చైనాకు చెందిన బైట్డాన్స్ చేతుల్లో ఉంది. ఒక వేళ చైనాకు టిక్టాక్ను అమ్మితే.. భారత్లో తిరిగి ప్రారంభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ఎలాంటి ఆటంకాలు లేవు.. ఇరు దేశాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!