10,001mAh బ్యాటరీ.. ఒక్కసారి ఛార్జ్తో 1.5 రోజుల లైఫ్! Realme P4 Powerకు భారీ క్రేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme P4 Power: ఇప్పటి వరకు ఒక లెక్కా.. ఇక నుంచి ఒక లెక్క అంటోంది రిలయల్మీ కంపెనీ.. వినియోగదాలను ఇబ్బందులను తీర్చడానికి ముందడుగు వేసింది. పీ-సిరీస్లో భాగంగా రియల్మీ P4 పవర్ అనే స్మార్ట్ఫోన్ను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ను జనవరి 29, 2026న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు రియల్మీ తన సోషల్ మీడియా ప్రకటించింది. లాంచ్ అయిన వెంటనే ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి రానుంది. అయితే తాజాగా ఫ్లిప్కార్ట్లో ప్రత్యేక పేజీ షో అవుతోంది. వేల సంఖ్యలో వినియోగదారులు ఈ ఫోన్ కోసం వేయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్కి ఎందుకింత క్రేజ్ ఉందో ఇప్పుడు తెలుసుకుంది.
READ MORE: T–Hub: టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం
Also Read
- Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్
- Samsung Mini LED TV: సామ్ సంగ్ మినీ LED టీవీ భారత్ లో విడుదల.. నెక్ట్స్ జెన్ AI ఫీచర్లతో ప్రీమియం ఎక్స్పీరియన్స్
- Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్నెస్ ట్రాకర్ ..
- LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..
రియల్మీ P4 పవర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది బ్యాటరీ. ఈ ఫోన్లో ఏకంగా 10,001 mah బ్యాటరీ అమర్చారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసి సాధారణంగా వినియోగిస్తే కనీసం ఒకటిన్నర రోజు వరకు పనిచేస్తుందని రియల్మీ చెబుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్టాండ్బై మోడ్లో ఈ ఫోన్ 31 రోజులకు పైగా బ్యాటరీ నిలుస్తుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీ కేవలం 3 శాతం ఉన్నా.. దాదాపు రెండు గంటల వరకూ ఫోన్ ఉపయోగించవచ్చట. ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి లేదా బ్యాటరీ గురించి టెన్షన్ పడే వారికి ఇది మంచి వార్తే. డిజైన్ విషయంలోనూ రియల్మీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ ఫోన్ రూపకల్పన కోసం పర్ల్ అకాడమీతో కలిసి పనిచేసింది. అందుకే ఈ డివైస్ లుక్ స్టైలిష్గా, కొత్తగా ఉండనుంది. ఈ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అవి ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ బ్లూ, ట్రాన్స్ సిల్వర్.
READ MORE: US: అమెరికాలో ఘోరం.. భార్యతో పాటు ముగ్గురు బంధువుల్ని కాల్చి చంపిన ఎన్నారై
ఫోన్ లోపలి హార్డ్వేర్ విషయానికి వస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు గరిష్టంగా 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా కంపెనీ ఇవ్వనుంది. 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్టు చేస్తుంది. అలాగే హైపర్విజన్ చిప్, ఏఐ ఆధారిత మరో చిప్ సైతం ఈ ఫోన్లో ఉంటాయని రియల్మీ చెప్పింది. అయితే అవి ఎలా పనిచేస్తాయన్న వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఫోటోగ్రఫీ కోసం రియల్మీ P4 పవర్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మేయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో రావచ్చు. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా సైతం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వవచ్చని తెలుస్తోంది.
READ MORE: US: అమెరికాలో ఘోరం.. భార్యతో పాటు ముగ్గురు బంధువుల్ని కాల్చి చంపిన ఎన్నారై
సాఫ్ట్వేర్ విషయంలోనూ కంపెనీ కాంప్రమైజ్ కాలేదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో పాటు రియల్మీ యూఐ 7.0పై పనిచేస్తుంది. వినియోగదారులకు దీర్ఘకాలం అప్డేట్లు అందేలా రియల్మీ హామీ ఇచ్చింది. ఈ డివైస్కు మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ వెర్షన్ అప్డేట్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. డిస్ప్లే ఈ ఫోన్లో మరో పెద్ద ప్లస్ పాయింట్. ఇందులో 6.78 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో స్మూత్ టాచ్ అనుభవం లభించనుంది. అలాగే ధూళి, నీటికి తట్టుకునేలా ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ అందించవచ్చని సమాచారం. ధర విషయానికి వస్తే, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.37,999గా ఉండొచ్చని అంచనా. అయితే బేస్ వేరియంట్ మాత్రం రూ.30,000 లోపే ఉంటుందని భావిస్తున్నారు. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, ఆధునిక ఫీచర్లతో రియల్మీ P4 పవర్ మార్కెట్లో మంచి పోటీ ఇవ్వబోతుందనే అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం