Perks cut in Google: కొంత మంది గూగుల్ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు కట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perks cut in Google: టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న గూగుల్లో కొంత మంది ఉద్యోగుల ప్రోత్సాహకాలకు కోతపడనున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే తప్ప బిజినెస్ ట్రావెల్స్కి అనుమతివ్వొద్దని సీనియర్ మేనేజర్లకు పైనుంచి మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్ ఫంక్షన్లు, టీమ్ ఆఫ్సైట్లు, ఇన్-పర్సన్ ఈవెంట్స్కి ఇకపై అప్రూవల్ ఇవ్వబోమంటూ గూగుల్ ఉన్నతాధికారులు ఎగ్జిక్యూటివ్లకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులకు ఫ్రీ మీల్స్, ఆల్కహాల్, ఆన్సైట్ జిమ్లు తదితర ఇన్సెంటివ్లకు గూగుల్ పెట్టింది పేరు. కానీ.. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇతర సంస్థల మాదిరిగానే ఈ ఆఫర్లను కట్ చేస్తోంది.
బిలియన్ డాలర్లు కావాలి
Also Read
- Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Vivo X500 Series: సెప్టెంబర్లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
సోమాలియా దేశంలో విలయతాండవం చేస్తున్న కరువు నివారణకు తక్షణం బిలియన్ డాలర్ల నిధులు కావాలని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల విభాగం చీఫ్ మార్టిన్ గ్రిఫిత్ అన్నారు. కొన్నేళ్లుగా తిండికి తిప్పలు పడుతున్న ఈ ఆఫ్రికా దేశంలో రానున్న నెలల్లో మరియు వచ్చే ఏడాది తొలినాళ్లలో రెండుకు మించి డ్రై సీజన్లు నెలకొనే అవకాశం ఉందని అంచనా వేశారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కరువు పరిస్థితులు ఏర్పడనున్నాయని నిపుణుల కమిటీ తెలిపింది. దీంతో ఐక్యరాజ్యసమితి కోరుతున్న ఒకటీ పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు అదనంగా మరో బిలియన్ డాలర్లు అవసరమని మార్టిన్ గ్రిఫిత్ చెప్పారు.
Hyderabad’s Reality Boom: ఇదీ.. హైదరాబాద్ ‘రియల్’ డెవలప్మెంట్.
‘పీఎంశ్రీ’కి పచ్చజెండా
విద్యా ప్రమాణాల పెంపు కోసం ఉద్దేశించిన పీఎంశ్రీ పథకం అమలుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం పచ్చజెండా ఊపింది. ఈ స్కీమ్లో భాగంగా దేశంలోని 14,500 లకుపైగా పాఠశాలల అభివృద్ధికి 27,360 కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని నిర్ణయించింది. ఈ పథకం గురించి ప్రధాని మోడీ కొద్ది రోజుల కిందటే వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థలు నడిపే స్కూల్స్లో కొన్నింటిని సెలెక్ట్ చేసి వాటిని పీఎంశ్రీ పాఠశాలలుగా అప్గ్రేడ్ చేస్తారు. అయితే.. ఈ పథకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. నాణ్యమైన విద్య లక్ష్య సాధనలో ఇది సముద్రంలోని ఒక నీటి చుక్కతో సమానమన్నారు.
తాజావార్తలు
-
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!