టెక్నాలజీ రోజు రోజుకు కొంత పుంతలు తొక్కుతుంది.. కొత్త కొత్త ఆవిష్కరణలకు అద్దం పడుతుంది.. అన్ని రంగాలతో పాటుగా ఫుడ్ వ్యాపారాల్లో కూడా వ్యాపార వేత్తలు టెక్నాలజిని వాడుతున్నారు.. కొత్త వంటలతో పాటుగాసర్వీసుల కోసం కూడా కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ రోబోలను ఉపయోగిస్తున్నారు.. ఇకపోతే ఇప్పటికే పలు రంగాల్లో తన ఉనికిని చాటుతున్న AI ఇప్పుడు ఫుడ్ తయారీలో కూడా మరో ముందడుగు వేసింది..AI తో నూతన ఆవిష్కరణ కొత్త పరికరం మార్కెట్లోకి వచ్చింది.. ఆ వస్తువు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈరోజుల్లో జనాలు హెల్త్ కు మంచివి కాకుండా నోటికి రుచిగా ఉండేవాటిని ఇష్టపడుతున్నారు.. అందులో పిజ్జా, బర్గర్, చికెన్, పిష్ వంటి వాటిని ఎక్కువ నాన్ ప్రియులు ఇష్టపడుతున్నారు.. రోజూ చికెన్ తినకుండా ఉండలేనివారు కూడా చాలామంది ఉంటారు.. అంతగా కొంతమంది చికెన్ ను బాగా ఇష్టపడతారు. ఇక యువతీ, యువకులు ఫాస్ట్ఫుడ్ కి బాగా అలవాటు పడిపోతున్నారు. చిన్నారుల నుంచి యువకుల వరకు పిజ్జా, బర్గర్లు తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏఐ పిజ్జా, బర్గర్, చికెన్, పిష్ కూడా రాబోతుంది..
బ్రిటన్ కు చెందిన ససీర్ గ్రిల్స్ అనే స్టార్టప్ ఏఐ ఆధారిత గ్రిల్ పర్పెక్టాను విడుదల చేసింది. మనకు ఏం కావాలో చెబితే మూడు నిమిషాల్లోనే వసందైన విందును ఆఫర్ చేస్తుంది. దీనిని ఆస్టన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్ తో కలిసి ఈ కొత్త గ్రిల్ ను ఆవిష్కరించింది.. పర్పాక్టా డ్యుయల్ వర్టికల్ ఇన్ఫ్రా రెడ్ బర్నర్స్ను కలిగి ఉంటుంది. ఏఐ అల్గారిథమ్స్, స్టార్ట్ సెన్సార్ల కాంబినేషన్ ఆధారంగా ఇది పనిచేస్తుందని ఆయా కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది.. ఇందులో కేవలం రెండు నిమిషాల లోపు బర్గర్ రెడీ అవుతుందని చెబుతున్నారు.. 2.30 నిమిషాల్లో చికెన్, 2 నిమిషాల్లో పిష్ ను తయారుచేస్తుంది. ఇక బర్గర్, పిజ్జాను కేవలం నిమిషంలోనే రెడీ చేస్తుంది. దీని ధరను రూ.2.9 లక్షలుగా నిర్ణయించారు.. దీనివల్ల ఎక్కువ మందికి వెంటనే ఫుడ్ ను అందించవచ్చు అని ప్రముఖులు తెలుపుతున్నారు..