Online Games: ఆన్లైన్లో ఆడినంత ఆట. 5జీ ఎంట్రీతో ఆకాశమే హద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Games: మన దేశంలో సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న సరికొత్త 5జీ ఆవిష్కరణలు ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీని నూతన శిఖరాలకు చేర్చనున్నాయి. ఇండియాలో ప్రస్తుతం 42 కోట్ల మంది యాక్టివ్ ఆన్లైన్ గేమర్లు, 50 కోట్ల మంది యంగ్ డిజిటల్ యూజర్లు ఉన్నారు. ఈ విషయాలను ఇండస్ట్రీ నిపుణులు ఇండియా గేమింగ్ కాన్క్లేవ్ సెకండ్ ఎడిషన్ సమావేశంలో వెల్లడించారు.
‘వేదాంత’ లక్ష్యం
Also Read
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
- Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
- Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్బుక్, ఐప్యాడ్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వేదాంత సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 17 బిలియన్ డాలర్ల రెవెన్యూని సాధించింది. సంస్థ అభివృద్ధితోపాటు సహజ వనరుల గుర్తింపు మరియు తవ్వకాల కోసం వచ్చే రెండేళ్లలో సుమారు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అనిల్ అగర్వాల్ తెలిపారు.
KG to PG First Campus: ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ‘కేజీ టు పీజీ’ ఫస్ట్ క్యాంపస్
పరిమితి ఎత్తివేత
దేశీయ విమాన టికెట్ల ధరలపై పరిమితిని ఈ నెలాఖరు నుంచి ఎత్తివేయాలని పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికుల ఛార్జీలను పెంచేందుకు ఎయిర్లైన్స్కి అవకాశం లభించనుంది. లాక్డౌన్ తర్వాత 2020 మే నెలలో ప్యాసింజర్ల సంఖ్యతోపాటు టికెట్ల రేట్లపైన కేంద్ర ప్రభుత్వం లిమిట్ పెట్టింది. ప్రయాణికుల సంఖ్య పైన విధించిన పరిమితిని మాత్రం గత అక్టోబర్లో తొలగించింది. ఇప్పుడు టికెట్ల రేటు పైనా లిమిట్ని ఎత్తివేస్తోంది.
ఫండ్ రైజింగ్
ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఫండ్ రైజింగ్పై ఫోకస్ పెట్టాయి. విడతల వారీగా బాండ్లను విక్రయించటం ద్వారా 8 వేల కోట్ల రూపాయల వరకు సేకరించనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 వేల కోట్లను, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 నుంచి 4 వేల కోట్లను తమ ఖజానాలకు సమీకరించుకోనున్నాయి.
ఉక్రెయిన్కి ఊరట
రష్యాతో యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉక్రెయిన్కి కాస్త ఊరట లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండేళ్లపాటు రుణాల చెల్లింపులు చేయలేమన్న ఉక్రెయిన్ నిస్సహాయతని విదేశీ ఆర్థిక సంస్థలు పెద్ద మనసుతో మన్నించాయి. ఇంటర్నేషనల్ బాండ్ల జారీ ద్వారా తీసుకున్న దాదాపు 20 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్ తిరిగి కట్టాల్సి ఉంది.
ప్రస్తుత ధరలు
24 క్యారెట్ల నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 660 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం 51 వేల 650 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర కూడా నిన్నటి కన్నా 600 రూపాయలు తక్కువే ఉంది. మరో వైపు.. వెండి రేటు నామమాత్రంగా 300 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర 58 వేల 700 రూపాయల వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?