Online Games: ఆన్లైన్లో ఆడినంత ఆట. 5జీ ఎంట్రీతో ఆకాశమే హద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Games: మన దేశంలో సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న సరికొత్త 5జీ ఆవిష్కరణలు ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీని నూతన శిఖరాలకు చేర్చనున్నాయి. ఇండియాలో ప్రస్తుతం 42 కోట్ల మంది యాక్టివ్ ఆన్లైన్ గేమర్లు, 50 కోట్ల మంది యంగ్ డిజిటల్ యూజర్లు ఉన్నారు. ఈ విషయాలను ఇండస్ట్రీ నిపుణులు ఇండియా గేమింగ్ కాన్క్లేవ్ సెకండ్ ఎడిషన్ సమావేశంలో వెల్లడించారు.
‘వేదాంత’ లక్ష్యం
Also Read
- Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వేదాంత సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 17 బిలియన్ డాలర్ల రెవెన్యూని సాధించింది. సంస్థ అభివృద్ధితోపాటు సహజ వనరుల గుర్తింపు మరియు తవ్వకాల కోసం వచ్చే రెండేళ్లలో సుమారు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అనిల్ అగర్వాల్ తెలిపారు.
KG to PG First Campus: ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ‘కేజీ టు పీజీ’ ఫస్ట్ క్యాంపస్
పరిమితి ఎత్తివేత
దేశీయ విమాన టికెట్ల ధరలపై పరిమితిని ఈ నెలాఖరు నుంచి ఎత్తివేయాలని పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికుల ఛార్జీలను పెంచేందుకు ఎయిర్లైన్స్కి అవకాశం లభించనుంది. లాక్డౌన్ తర్వాత 2020 మే నెలలో ప్యాసింజర్ల సంఖ్యతోపాటు టికెట్ల రేట్లపైన కేంద్ర ప్రభుత్వం లిమిట్ పెట్టింది. ప్రయాణికుల సంఖ్య పైన విధించిన పరిమితిని మాత్రం గత అక్టోబర్లో తొలగించింది. ఇప్పుడు టికెట్ల రేటు పైనా లిమిట్ని ఎత్తివేస్తోంది.
ఫండ్ రైజింగ్
ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఫండ్ రైజింగ్పై ఫోకస్ పెట్టాయి. విడతల వారీగా బాండ్లను విక్రయించటం ద్వారా 8 వేల కోట్ల రూపాయల వరకు సేకరించనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 వేల కోట్లను, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 నుంచి 4 వేల కోట్లను తమ ఖజానాలకు సమీకరించుకోనున్నాయి.
ఉక్రెయిన్కి ఊరట
రష్యాతో యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉక్రెయిన్కి కాస్త ఊరట లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండేళ్లపాటు రుణాల చెల్లింపులు చేయలేమన్న ఉక్రెయిన్ నిస్సహాయతని విదేశీ ఆర్థిక సంస్థలు పెద్ద మనసుతో మన్నించాయి. ఇంటర్నేషనల్ బాండ్ల జారీ ద్వారా తీసుకున్న దాదాపు 20 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్ తిరిగి కట్టాల్సి ఉంది.
ప్రస్తుత ధరలు
24 క్యారెట్ల నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 660 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం 51 వేల 650 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర కూడా నిన్నటి కన్నా 600 రూపాయలు తక్కువే ఉంది. మరో వైపు.. వెండి రేటు నామమాత్రంగా 300 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర 58 వేల 700 రూపాయల వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!