OnePlus-Bhagwati: భారత్లోనే ప్రీమియమ్ ట్యాబ్లెట్ల తయారీ.. భగవతి ప్రొడక్ట్స్తో చేతులు కలిపిన వన్ప్లస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus – Bhagwati: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్ప్లస్ (OnePlus) సంస్థ భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (BPL) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, వన్ప్లస్ టాబ్లెట్లు ఇకపై భారతదేశంలోనే అసెంబుల్ చేయబడతాయి. భగవతి ప్రొడక్ట్స్ గ్రేటర్ నోయిడాలోని ఫ్యాక్టరీలో ఈ వన్ప్లస్ టాబ్లెట్ల ఉత్పత్తిని చేపట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రారంభ దశలో వన్ ప్లస్ ప్యాడ్ 3, వన్ ప్లస్ ప్యాడ్ లైట్ మోడళ్లను తయారు చేయనున్నారు.
Also Read
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
- Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
- Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. 'బాస్ స్కామ్'పై సెబీ హెచ్చరిక..
ఇప్పటివరకు వన్ప్లస్ స్మార్ట్ఫోన్లు మాత్రమే భారతదేశంలో తయారు అవుతుండగా.. ఈ కొత్త కలియక ద్వారా మొదటిసారి టాబ్లెట్స్ ఉత్పత్తి కూడా దేశీయంగా ప్రారంభం కానుంది. ఇది వన్ప్లస్ “Made in India” పోర్ట్ఫోలియోను స్మార్ట్ఫోన్లకు మించి విస్తరించే ఆలోచంలో ప్లాన్ చేసినట్లుగా కనపడుతోంది. ఈ ప్రయత్నం వన్ప్లస్ దీర్ఘకాలిక భారత మార్కెట్ లో కొనసాగింపుకు, “ప్రాజెక్ట్ స్టార్ లైట్” అనే స్థానిక తయారీ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యానికి అనుగుణంగా సాగనుంది.
ZPTC Elections :ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి కౌంటర్
మరోవైపు వన్ప్లస్ ‘ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్’తో కలిసి భారతదేశంలో AIoT ఉత్పత్తులను (OnePlus Bullets Wireless Z3 తో ప్రారంభమై) తయారు చేయడం కూడా ప్రారంభించింది. భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కోసం వన్ప్లస్ టాబ్లెట్ల ఉత్పత్తి, స్థానికీకరణ పనులను భగవతి ప్రొడక్ట్స్ గ్రేటర్ నోయిడా ప్లాంట్లో నిర్వహిస్తుంది. ఈ భాగస్వామ్యంపై వన్ప్లస్ ఇండియా CEO రోబిన్ లియూ మాట్లాడుతూ.. BPL తో భాగస్వామ్యం మా తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో, అలాగే కనెక్టెడ్ ఎకోసిస్టమ్ను విస్తరించడంలో ఒక కీలక మైలురాయిగా అభివర్ణించారు. టాబ్లెట్ ఉత్పత్తిని స్థానికంగా చేపట్టడం ద్వారా భారత మార్కెట్ పట్ల మా నిబద్ధతను బలోపేతం చేస్తున్నాం. ఇది భారతదేశానికి, భారత వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు తీసుకున్న దీర్ఘకాలిక వ్యూహాత్మక అడుగని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?