Microsoft: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. ఏకంగా వెయ్యి మంది ఇంటికే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది… ఏకంగా 1000 మందిని తాజాగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది.. వీటిని రోల్ ఎలిమినేషన్స్గా పేర్కొన్నట్టు యూఎస్ న్యూస్ వెబ్సైట్ Axios తెలిపింది.. ఇటీవల వరుసగా ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చింది టెక్ దిగ్గజ సంస్థ. జులైలో కంపెనీ తన 1,80,000 మంది ఉద్యోగులలో 1 శాతం మందిని రీ-అలైన్మెంట్లో భాగంగా తొలగించింది. ఆగస్టులో, కంపెనీ తన పరిశోధన మరియు అభివృద్ధి విభాగం నుండి మరో 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు.. మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ మరియు అజూర్ స్పేస్ నుండి కొంతమందితో సహా మొత్తం 1,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్లను అందజేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూలై నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించడం ఇది మూడోసారి.
Read Also: Jogi Ramesh: పవన్ కళ్యాణ్.. టైం, డేట్, ప్లేస్ చెప్పు.. సింగిల్గా వస్తా
Also Read
- Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
- Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
తొలగించబడిన వ్యక్తుల సంఖ్యను మైక్రోసాఫ్ట్ ధృవీకరించనప్పటికీ, అనేక మంది తొలగించబడిన ఉద్యోగులు ఈ వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. మైక్రోసాఫ్ట్ అజూర్లో ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్గా పనిచేసిన గ్రెగ్ చాప్మన్ ట్వీట్ చేస్తూ, “వెల్ప్, ఇది ఒక సాహసం. ఈ రోజు నేను మరియు నా టీమ్ మొత్తం తొలగించబడ్డాము. మైక్రోసాఫ్ట్లో 12 సంవత్సరాలు మరియు గేమ్దేవ్లో 25 సంవత్సరాలు పనిచేసిన నాకు షాక్ తప్పలేదని పేర్కొన్నారు. ఇక, అన్ని కంపెనీల మాదిరిగానే, మేం మా వ్యాపార ప్రాధాన్యతలను క్రమ పద్ధతిలో మూల్యాంకనం చేస్తాం.. తదనుగుణంగా నిర్మాణాత్మక సర్దుబాట్లు చేస్తాం. మేం మా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాం. రాబోయే సంవత్సరంలో కీలక వృద్ధి రంగాలలో నియామకాలు చేస్తాం”అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి పేర్కొన్నట్టు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీలు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే ప్రపంచ దేశాల సీఈవోలు, భారత కంపెనీలకు చెందిన సీఈవోలు చెబుతున్నారు. చాలా వరకు ఉద్యోగాలు పోతాయని.. కొత్తగా నియామకాలు కూడా ఆగిపోతాయని హెచ్చరించారు. అయితే ఈ ప్రభావం కొంతకాలమే ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ మూడేళ్లలో పరిస్థితులు సద్దుమణుగుతాయని సీఈవోలు అభిప్రాయపడ్డారు.
కాగా, గత కొన్ని నెలలుగా, అనే పెద్ద టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటివరకు, ఓటీటీ ప్లాట్ఫారమ్ Netflix 450 మంది ఉద్యోగులను తొలగించింది, అయితే మేటా 12,000 మంది ఉద్యోగులను లేదా 15 శాతం ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. జూన్లో, ట్విట్టర్ తన ఉద్యోగులలో 30 శాతం మందిని తొలగించింది. ఓ నివేదిక ప్రకారం, అక్టోబర్ మధ్య నాటికి యూఎస్ టెక్ మార్కెట్లో దాదాపు 44,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. “2022లో పబ్లిక్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి మరియు అది ప్రైవేట్ మార్కెట్లకు పడిపోయింది. ద్రవ్యోల్బణం ఆందోళనలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు మరియు భౌగోళిక రాజకీయ సమస్యలు రోలర్-కోస్టర్ స్టాక్ మార్కెట్కు దోహదం చేశాయి” అని ఓ నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!